రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) యూటెక్ సంస్థకు అప్పగించింది.
నేపాల్లో వాయువ్య ప్రాంతంలో గత రాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంనలు చోటుచేసుకున్నాయి.
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ దేశ ఎన్నికల సంఘం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణపై నెలల తరబడి ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది.
బస్తర్ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని ఒక గ్రామంలోని ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. కాంకేర్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో అన్యమత గుర్తు ఉన్న గొలుసు ధరించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు.
రోడ్డుపై ముందు వెళ్తున్న ట్రక్కును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా డెలివరీ బాయ్ పేరుతో కొత్త మార్గంలో స్కామ్కు తెరదీశారు.