తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (chopper crash) ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు (Chittoor district) చెందిన లాన్స్నాయక్ బి సాయితేజ (Lance Naik Sai Teja) మృతిచెందారు. వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లెలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయితేజ తల్లి, భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.