ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశలో ఆలోచన చేయాలని బ్యాంకర్లకు సూచించిన ఆయన.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఏటీఎంలు (ATMs) ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు చేపట్టాలన్నారు.