తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:44 PM (IST) May 08
India-Pakistan Border Tensions: భారత సైన్యం ఇద్దరు పాకిస్థానీ యుద్ధ విమానం పైలట్లను జైసల్మేర్, అఖ్నూర్లలో పట్టుకున్నాయి.
పూర్తి కథనం చదవండి11:33 PM (IST) May 08
india pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఫోన్ లో మాట్లాడారు. అమెరికాతో పాటు భారత్ కు అనేక దేశాలు మద్దతును ప్రకటిస్తున్నాయి.
11:07 PM (IST) May 08
పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా భారత్పై దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగానే జమ్ముపై దాడి చేసింది.
10:43 PM (IST) May 08
పాకిస్తాన్ ఉగ్ర దాడుల పరంపరలో మరో ఘట్టంగా జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, అర్ణియా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత భద్రతా బలగాలు పూర్తిగా అడ్డుకున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
10:38 PM (IST) May 08
Obulapuram mining case: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.
పూర్తి కథనం చదవండి10:18 PM (IST) May 08
పాకిస్థాన్ దాడితో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని పాకిస్థాన్ యుద్ధ విమానాలతో రెచ్చిపోతోంది. జమ్ముతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడుల చేస్తోంది. దీంతో ఈ రోజు రాత్రి ఏం జరగనుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
10:14 PM (IST) May 08
india pakistan tension: పాక్ కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూపై దాడులు చేసింది. దీనిని భారత్ ధీటుగా ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే పంజాబ్ vs ఢిల్లీ మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేశారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకన్నారు.
పూర్తి కథనం చదవండి10:08 PM (IST) May 08
శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ, సెయింట్ పీటర్స్ స్క్వేర్లో గుమిగూడిన ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారు
పూర్తి కథనం చదవండి09:59 PM (IST) May 08
india pakistan tension: గురువారం రాత్రి పాకిస్తాన్ భారత్ పై దాడులకు పాల్పడగా.. పాక్ దాడులను భారత్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. దాడుల నేపథ్యంలో సరిహద్దులో ప్రాంతాల్లో బ్లాకౌట్ కొనసాగుతోంది.
09:34 PM (IST) May 08
పాకిస్థాన్ చర్యలకు భారత్ ధీటుగా స్పందిస్తోంది. జమ్ములో పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని దాడులకు దిగిన పాకిస్థాన్ యుద్ధవిమాలను కూల్చి వేస్తోంది. ఇప్పటి వరకు 3 యుద్ధ విమానాలను కూల్చి వేసినట్లు తెలుస్తోంది.
09:19 PM (IST) May 08
ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలను ఆయన మరోసారి బయటపెట్టారు.
పూర్తి కథనం చదవండి09:11 PM (IST) May 08
పాకిస్థాన్ బరితెగిస్తోంది. ఉగ్రవాదులను టార్గెట్ చేసి భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ని చేపడితే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం జమ్ములోని పలు చోట్ల రాకెట్లతో దాడి చేసింది.
పూర్తి కథనం చదవండి09:05 PM (IST) May 08
పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం డ్రోన్ దాడితో ధ్వంసం చేసింది. దీంతో చైనా ఆయుధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తి కథనం చదవండి09:03 PM (IST) May 08
Telangana police killed in Maoist landmine blast: ములుగు జిల్లాలో మావోయిస్టుల ల్యాండ్మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసుల ప్రాణాలు కోల్పోయారు.
09:00 PM (IST) May 08
భారత ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశాన్ని అల్లా కాపాడాలని ఆయన వేడుకున్నారు.
పూర్తి కథనం చదవండి08:40 PM (IST) May 08
పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి08:12 PM (IST) May 08
land for jobs scam: రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో జరిగిన భూ కుంభకోణం కేసులో ఆయనపై విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి07:51 PM (IST) May 08
Operation Sindoor: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 7.2% పతనం కావడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. కరాచీ, లాహోర్లో డ్రోన్ పుకార్లతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి.
పూర్తి కథనం చదవండి07:38 PM (IST) May 08
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో భేటీ అయ్యారు. వీరి భేటి ఆసక్తికరంగా మారింది.
పూర్తి కథనం చదవండి07:28 PM (IST) May 08
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతవరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న అందోళన అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్ఫించింది. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి ఉన్నపలంగా ఢిల్లీ వచ్చారు.
07:25 PM (IST) May 08
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ తాజాగా పూర్తైంది. పలు కారణాలతో ఇప్పటివరకు అనేకసార్లు ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.
పూర్తి కథనం చదవండి07:07 PM (IST) May 08
PM Modi Meets Army Chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో భేటీ అయ్యారు. ఇరువురు భారత్-పాక్ ఉద్రిక్తతలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారని సమాచారం.
పూర్తి కథనం చదవండి07:02 PM (IST) May 08
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేసషన్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
06:46 PM (IST) May 08
Korean LG team follows indian tradition: శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ ప్లాంట్ భూమి పూజలో కొరియన్ ప్రతినిధుల సంప్రదాయానికి పెద్దపీటవేశారు. నారా లోకేష్ సూచనలతో షూలు తొలగించి ఎల్జీ టీమ్ భూమి పూజలో పాల్గొన్నారు.
06:26 PM (IST) May 08
భారత్కు గట్టి సవాలుగా మారిన వామపక్ష తీవ్రవాదం (నక్సలిజం)పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా పోరాటం సాగిస్తోంది. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో, కేంద్రం అత్యంత భారీ స్థాయిలో “మిషన్ సంకల్ప్”ను ప్రారంభించింది. దాదాపు 24,000 మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో కూడిన బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి.
06:14 PM (IST) May 08
India Bans Pakistan origin content: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చెందిన వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు సహా డిజిటల్ కంటెంట్ పై బ్యాన్ విధించింది. భారత్లోని ఓటీటీలు వెంటనే పాకిస్తాన్ కంటెంట్ ను నిలిపేయాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.
పూర్తి కథనం చదవండి05:49 PM (IST) May 08
పాకిస్తాన్లోని ప్రధాన నగరాలపై భారత్ హరోప్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటి?
పూర్తి కథనం చదవండి05:46 PM (IST) May 08
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది.
పూర్తి కథనం చదవండి05:42 PM (IST) May 08
వేసవిలో నిమ్మకాయలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల వాటిల్లో రసం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పూర్తి కథనం చదవండి05:22 PM (IST) May 08
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అధికారులు, పోలీపులు అలర్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
పూర్తి కథనం చదవండి05:02 PM (IST) May 08
పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ తో పాటు ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది... వీలయితే లాహోర్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
పూర్తి కథనం చదవండి
04:59 PM (IST) May 08
మదర్స్ డే 2025: మే 11న మదర్స్ డే ఈ సందర్భంగా భర్తలకు దూరమై ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్న బాలీవుడ్ తల్లుల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
04:57 PM (IST) May 08
రాజధాని అమవరావతికి చట్ట బద్ధత కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
04:44 PM (IST) May 08
IPL 2025 PBKS vs MI: మే 11న జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 మ్యాచ్ ధర్మశాల నుంచి అహ్మదాబాద్కు మారింది. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య అక్కడి విమానాశ్రయ మూతపడింది.
04:37 PM (IST) May 08
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేతృత్వంలోని గగన్యాన్ మిషన్ కోసం సిద్దమవుతున్న కెప్టెన్ అజిత్ కృష్ణన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పిలుపు వచ్చింది. వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన ఐఎఎఫ్ నుండి ఆదేశాలు అందాయి
పూర్తి కథనం చదవండి
04:30 PM (IST) May 08
రూ.69,900 ఐఫోన్ 15 ఇప్పుడు అమెజాన్లో 16% తగ్గింపుతో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఐఫోన్ 15 కేవలం రూ.24,950కే మీకు సొంతం చేసుకోవచ్చు.
పూర్తి కథనం చదవండి04:22 PM (IST) May 08
కూలి సినిమా కోసం నటుడు రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి సన్ పిక్చర్స్ ఇచ్చిన పారితోషికం గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:19 PM (IST) May 08
Drone crash near Rawalpindi stadium: PSL మ్యాచ్కు ముందు పాక్ లోని రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కూలి రెస్టారెంట్ దెబ్బతింది. అలాగే, స్టేడియం పై కూడా ప్రభావం కనిపించిందని సమాచారం. పాకిస్తాన్ సూపర్ లీగ్ రద్దవుతుందా?
04:15 PM (IST) May 08
భారత్ పై దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతోంది భారత్. ఇప్పటికే బలహీనంగా ఉన్న పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేందుకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసారు.
పూర్తి కథనం చదవండి
03:54 PM (IST) May 08
Pope election: పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తొలి ఓటింగ్లో ఫలితం రాలేదు. వాటికన్లో నల్ల పొగ కనిపించింది.