india pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఫోన్ లో మాట్లాడారు. అమెరికాతో పాటు భారత్ కు అనేక దేశాలు మద్దతును ప్రకటిస్తున్నాయి.
india pakistan tension: భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ ప్రకారం, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో గురువారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
ఈ సంభాషణ సందర్భంగా, ప్రాంతంలో వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని రుబియో స్పష్టంగా పేర్కొన్నారు. "భారత్, పాకిస్తాన్లు ప్రత్యక్షంగా చర్చలు జరపాలని అమెరికా మద్దతిస్తుంది" అని రుబియో అన్నారు. కమ్యూనికేషన్ మెరుగుపరచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు.
పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిపై రుబియో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, అమెరికా భద్రత కోసం భారత్తో కలిసి పని చేయడంలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఈ ప్రకటనను ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయాన జారీ చేయడం గమనార్హం. భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేస్తూ, పాక్ ఆధారిత ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నదీ ఈ ప్రకటన సూచిస్తుంది. యూఎస్ ప్రకటన ప్రకారం.. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై భారత్-అమెరికా సహకారం వంటి అంశాలపై చర్చ జరిగింది.
గురువారం పాకిస్తాన్ జమ్మూ సహా పలు భారత ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడింది. పాక్ దాడులను భారత్ ధీటుగా ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా జమ్ములోని భారత సైన్యం స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. ఇందులో జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైన్యం స్థావరాలను పాక్ దళాలు డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, భారత్ ధీటుగా ఎదుర్కొందనీ, ఎలాంటి నష్టం జరగలేదని ఇండియన్ ఆర్మీ తెలిపింది.