Telangana police killed in Maoist landmine blast: ములుగు జిల్లాలో మావోయిస్టుల ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసుల ప్రాణాలు కోల్పోయారు. 

Three Telangana police killed in Maoist landmine blast: తెలంగాణ‌లోని ములుగు జిల్లా వాజేడూ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం 6 గంటలకు జరిగిన మావోయిస్టుల ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

బాంబ్ డిటెక్షన్ విధుల్లో భాగంగా గ్రే హౌండ్స్ బృందం పెనుగోలు-పెరూర్, వాజేడూ అటవీ ప్రాంతంలో కర్రెగుట్టా కొండల్లో గస్తీ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడి పేలుడు కారణంగా సందీప్, పవన్ కళ్యాణ్, శ్రీధర్ అనే జవాన్లు మృతి చెందారు.

ఈ ఘటనలో గాయపడిన రణ్ బీర్ అనే రైఫిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అత‌న్ని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ డా. జితేందర్, అదనపు డీఎస్పీ (గ్రే హౌండ్స్) ఎం. స్టీఫెన్ రవీంద్ర, వారంగల్ పోలీసు కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ మృతదేహాలకు నివాళులు అర్పించారు.

ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నార‌ని స‌మాచారం. ఈ ఘ‌టన‌పై తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ మాట్లాడుతూ.. ఉద‌యం 6 గంటలకు వాజేడు, పేరూరలో మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చార‌న్నారు. దాదాపు 40 మంది మావోయిస్టులు కాల్పుల‌కు కూడా తెగ‌బ‌డ్డార‌ని చెప్పారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని వివ‌రించారు.