అగ్నిపథ్ స్కీంపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకారులను ఉపశమనపరిచే వార్తలు తెలిపాయి. అగ్నివీర్లు నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత తమ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో చేర్చుకుంటామని, లేదా ఆ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నాయి.