అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి బయటకు వచ్చే అగ్నివీరులకు పెన్షన్ లేనప్పుడు ఐదేళ్లు పదవిలో ఉండి దిగిపోయే ప్రజా ప్రతినిధులకు ఎందుకు పెన్షన్ ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను తన పెన్షన్ వదులుకోవడానికి సిద్ధం అని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి ముస్లిం మేధావుల వర్గం మద్దతు ప్రకటించింది. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవల చేయాలని ముస్లి యువతను కోరింది. ఈ పథకంపై అపోహలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపింది.
అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉధృతంగా నిరసనలు జరిగాయి. అందులో ముఖ్యంగా నిరసనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరిగిన విధ్వంసంలో కేవలం 4 రోజుల్లోనే రైల్వే శాఖ సుమారు రూ. 1000 కోట్లు నష్టపోయింది.
అగ్నిపథ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసినా దానిపై వ్యతిరేకత తగ్గడం లేదు. హర్యానాలోని ఖాప్ నేతలు బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అగ్నిపథ్ స్కీంకు దరఖాస్తు చేసుకున్నవారిని బహిష్కరిస్తామని, అధికార పార్టీ నేతలను, ఈ స్కీంకు మద్దతు తెలిపిన కార్పొరేట్ సంస్థలనూ బహిష్కరిస్తామని తెలిపారు.
Agnipath Protest: గోవా రాష్ట్ర సర్వీసుల్లో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని, పోలీసు, అటవీ, జైళ్ల శాఖ వంటి సేవల్లో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. అగ్నిపథ్ పధకాన్ని అందరూ ఆహ్వానించాలని అన్నారు.
Agnipath Protests: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహించబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆ రోజున.. అన్నినియోజకవర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడుతారని ప్రకటించారు.
Agnipath scheme: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని తాను చెప్పాననీ, ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ చెబుతోందని, యువత అంతా అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్ మెంట్ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆందోళనలో పాల్గొన్న వరంగల్ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఈ స్కీంను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కొన్నేళ్ల తరబడి సాగిన మేధోమథనం ద్వారా ఈ స్కీం రూపుదాల్చిందని వివరించారు.
అగ్నిపథ్ పథకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసింది. ఈ పథకంపై నిర్ణయం తీసుకునే ముందు తమ మాట కూడా వినాలని కోరింది.