అగ్నిపథ్ స్కీంపై ఇండియన్ నేవీ చీఫ్ అడ్మైరల్ ఆర్ హరి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కీం ఇప్పటికిప్పుడు రూపొందించినది కాదని, రెండేళ్లుగా ఈ స్కీం గురించి కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. అలాగే, ఈ స్కీం అభ్యర్థులు తాము సైన్యంలో ఇమిడిపోగలమా? లేదా? అనే తెలుసుకునే సదవకాశం ఉంటుందని, ఇమిడిపోకుంటే బయటకు వెళ్లవచ్చని, లేదంటే.. అందులోనే కొనసాగడానికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.