ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ విషయమై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. మిలిటరీ చీఫ్ల వెనుక దాక్కోవద్దని మోడీపై విమర్శలు చేశారు. ధైర్యంగా తమ నిర్ణయానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాల్పులు రాష్ట్ర పోలీసులు జరిపారో, రైల్వే పోలీసులు జరిపారో తేలాల్సి ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ రాకేష్ చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం నాడు చోటు చేసుకొన్న విధ్వంసం నేపథ్యంలో సుమారు 72 రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్ల రద్దు, రైళ్ల దారి మళ్లింపు సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే 040-27786666 నెంబర్ ఏర్పాటు చేసింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకొన్న విధ్వంసం దురదృష్టకరమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకొన్న విధ్వంఃసంపై స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నాయి. ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్కీంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఈ అభ్యర్థులు వేటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సుమారు 40 బైక్ లు ధ్వంసమయ్యాయి. రైళ్లలో ఒక్క ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బైక్ లను తరలిస్తుంటారు. రైల్వే పార్శిల్ కౌంటర్ నుండి బైక్ లను పట్టాలపై వేసి ఆందోళన చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ లో ఆందోళన చేస్తున్న వారిలో 10 మంది ఆర్మీ ఉన్నతాధికారులతో చర్చలకు రావాలని పోలీసులు కోరారు. అయితే ఈ విషయమై ఆందోళనకారులు మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. ఆర్మీ అధికారులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు రావాలని కోరుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురికి బుల్లెట్ గాయాలున్నట్టుగా వైద్యులు చెప్పారు. సుమారు 15 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నామని వైద్యులు వివరించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసేందుకు వాట్సాప్ గ్రూప్ లను ఆందోళనకారులు క్రియేట్ చేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో నిరసనకు సంబంధించి ప్లాన్ చేశారు. ఇవాళ ఉదయమే ఆందోళనకారులు ఒక్కసాారిగా మెట్రో రైల్వేస్టేషన్లకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.