తెలంగాణ బీజేపీ ఆందోళనలు ఉధృతంగా చేపట్టనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో మొత్తం 100 రోజుల ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ వేసింది. రేషన్ కార్డుల జారీ, రైతు రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు డిమాండ్లు ప్రధానం చేసుకుని ఈ నిరసనలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Telangana Jul 22, 2023, 5:03 PM IST
రైతుల భూములు కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మట్టిని నమ్ముకున్న రైతుల జోలికి వస్తే నీ భరతం పడతామంటూ ఈటల హెచ్చరించారు.
Telangana Jul 15, 2023, 6:33 PM IST
ధరణి పోర్టల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి వ్యవహారాలన్నీ కేటీఆర్ మిత్రుడి కనుసన్నల్లోనే సాగుతున్నాయని.. భూములను పెద్ద ఎత్తున కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Telangana Jul 6, 2023, 3:37 PM IST
సీఎం కేసీఆర్ ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.
Telangana Jul 2, 2023, 6:52 PM IST
ధరణి పోర్టల్పై బీజేపీ నేతలు జేపీ నడ్డా, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని పార్టీ కేడర్లో అయోమయానికి కారణమవుతున్నాయి. ధరణి పోర్టల్ ఎత్తేస్తామని జేపీ నడ్డా, ఉంచుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Telangana Jun 25, 2023, 9:46 PM IST
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ధరణి పోర్టల్ను కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. అలాగే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వుంటాయని స్పష్టం చేశారు.
Telangana Jun 16, 2023, 9:48 PM IST
ధరణి పోర్టల్ కారణంగా ప్రజలకు నష్టమే ఎక్కువగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల భూముల వివరాలన్నీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Telangana Jun 14, 2023, 4:47 PM IST
Hyderabad: ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొన్నాళ్ల క్రితం బీజేపీపై కూడా కేసీఆర్ ఇదే తరహా పదాలు వాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో కేసీఆర్ ఆ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడేస్తామని మాట్లాడేవారిని బంగాళాఖాతంలో విసిరేయాలని ఆయన ఈ నెల 6న నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో అన్నారు.
Telangana Jun 14, 2023, 3:59 PM IST
Adilabad: బీఆర్ఎస్ నేతల ఎత్తుగడలకు భిన్నంగా ధరణి పోర్టల్ అక్రమాలను భట్టి విక్రమార్క తన పిపుల్స్ మార్చ్ పాదయాత్రలో విజయవంతంగా ఎండగట్టారు. భూ రెవెన్యూ రికార్డుల నుంచి వివరాలను తొలగించడం ద్వారా పేద రైతుల భూములను లాక్కోవడానికి ధరణి పోర్టల్ ప్రభుత్వానికి ఎలా వీలు కల్పించిందో వివరిస్తూ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఈ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ శాంతి, ప్రేమ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఈ పాదయాత్ర కాంగ్రెస్ నాయకులకు వివిధ రంగాలలో ప్రజల బాధలను తెలుసుకోవడానికి, పార్టీ అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తామని గట్టి హామీలు ఇవ్వడానికి దోహదపడిందని చెప్పాలి.
Telangana Jun 13, 2023, 2:15 PM IST
ధరణి పోర్టల్ ద్వారా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Telangana Jun 12, 2023, 4:57 PM IST
సదాశివపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Telangana Jun 7, 2023, 2:33 PM IST
నిర్మల్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను తీసేస్తామని వాళ్లు అంటున్నారని.. వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేయాలని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Telangana Jun 4, 2023, 7:30 PM IST
ధరణి పోర్టల్ కారణంగా భూ సమస్యలు ఇంకా ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
Telangana May 12, 2023, 4:56 PM IST
భూ దస్త్రాలను డిజిటలైజ్ చేసి, భూ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా చోట్ల ఇబ్బంది పెడుతోంది. ఒకరి పేరుపై ఉండాల్సిన భూమి మరొకరి పేరుపైన ఉంటోంది. దీంతో అసలైన భూ యజమానులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
Telangana Mar 15, 2023, 3:14 PM IST
ధరణి పోర్టల్ కారణంగా గ్రామాల్లో సమస్యలు నెలకొంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామన్నారు.
Telangana Mar 10, 2023, 2:51 PM IST