దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని ఈ నాలుగు మండలాలను ఎంపిక చేశామన్నారు.
Telangana Sep 1, 2021, 12:15 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Aug 29, 2021, 5:26 PM IST
అంబేద్కర్ ఆశయ సాధన కోసం కేసీఆర్ మహోన్నత నిర్ణయం తీసుకొన్నారన్నారు. దేశంలో దళితుల కోసం నామమాత్రం స్కీమ్ లు పెట్టారన్నారు.
వ్యవస్థలో హెచ్చు తగ్గులు పోవాలంటే ఆర్ధిక స్వావలంభన కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ దళితులకు దళితబంధును వందశాతం అమలు చేస్తారన్నారు.
Telangana Aug 29, 2021, 1:08 PM IST
చివరి రక్తం బొట్టు వరకు దళితుల అభివృద్ది కోసం పోరాటం చేస్తానని కేసీఆర్ తేల్చి చెప్పారు. దళితబంధును విజయవంతం చేసి తీరుతానని సీఎం చెప్పారు. తెలంగాణ సాధించినట్టే దళితబంధును కూడా అమలు చేస్తానని కేసీఆర్ తెలిపారు.
Telangana Aug 27, 2021, 3:57 PM IST
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ పథకం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల వారీగా విడుదల చేసింది. ఇప్పటికే రూ. 2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది ప్రభుత్వం.
ఈ పథకం కింద నిధులను వినియోగించుకొనే విషయమై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Telangana Aug 27, 2021, 1:24 PM IST
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. దళితబంధును హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకురావడంపై విపక్షాలు టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించాయి.
Telangana Aug 24, 2021, 11:10 AM IST
జీహెచ్ ఎంసీ ఎన్నికలకు రాని కరోనా.. దళిత బంధువుకు వచ్చిందా? హుజూరాబాద్ లో పథకాలు అభివృద్ది జరుగుతుందంటే ఈటల రాజేందర్ వల్లనే. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని జీవో విడుదల చేశావ్. రాష్ట్రంలో కులసంఘలకు ఇస్తా అన్న కమ్యూనిటీ హల్ ల హామీ ప్రోసిడింగ్ ల వరకే ఆగిపోయింది.
Telangana Aug 21, 2021, 2:30 PM IST
వాసాలమర్రికి దళితబంధును అమలు చేయడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. నిబంధనలు ఖరారు చేయకుండానే వాసాలమర్రికి దళితబంధు కింద నిధులు మంజూరు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
Telangana Aug 18, 2021, 2:01 PM IST
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా కష్టపడి పనిచేస్తాడని ఆయన చెప్పారు. తానే ఈ జిల్లాకు కలెక్టర్ ను ఈ జిల్లాకు కలెక్టర్ గా నియమించానని ఆయన చెప్పారు.
Telangana Aug 16, 2021, 3:58 PM IST
Telangana Aug 16, 2021, 3:33 PM IST
దళిత బంధు పథకాన్ని దళితులతోపాటు ఇతర కులాల్లోని పేద కుటుంబాలకూ వర్తింపజేయాలని ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే వాసాలమర్రిలో ప్రారంభించిన ఈ పథకంపై ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఇది కేవలం ఎన్నికల్లో అస్త్రంగా మిగిలిపోకూడదని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు అర్హులకు నిధులు అందించాలని డిమాండ్ చేశారు. సీఎం సభ కారణంగా హుజురాబాద్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని, వారిని నిర్బంధించడానికి పోలీసు స్టేషన్లు, పాఠశాలలు సరిపోవడం లేదని చెప్పారు. మీటింగ్కు ప్రజలు వస్తారో రారో అనే సంశయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఇక్కడి తరలిస్తున్నారని విమర్శించారు.
Telangana Aug 16, 2021, 3:09 PM IST
దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు హుజూరాబాద్ సిద్ధమవుతోంది. హుజూరాబాద్- జమ్మికుంట ప్రధాన రహదారి పక్కనే శాలపల్లి ఇందిరానగర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చెక్కులను సీఎం అందజేయనున్నారు.
Telangana Aug 15, 2021, 8:19 PM IST
రేపు హుజురాబాద్లో జరగనున్న కెసిఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సర్పంచ్ వీడియో పోస్ట్ కలకలం రేపుతోంది. అతనిని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ సర్పంచ్ మహేందర్ గౌడ్గా గుర్తించారు. బిల్లులు నిలిపివేయడంపైనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Telangana Aug 15, 2021, 7:21 PM IST
దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు
Telangana Aug 14, 2021, 4:29 PM IST
తమకు చేతనైనంతలో దళితులకు పది లక్షలు ఇస్తున్నామని.. కానీ బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని అంటున్నారని, అలాంటప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రూ.40 లక్షలు తీసుకొచ్చి ఇస్తే సంతోషిస్తామని హరీశ్ అన్నారు. అదే జరిగితే ప్రధాని మోడీ, బండి సంజయ్లకు పాలాభిషేకం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు
Telangana Aug 14, 2021, 3:42 PM IST