అమరావతి: సాఫీగా సాగుతుందని భావించిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవులు దక్కుతాయని ఆశించి భంగపడ్డ వారు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఇలా వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవి కొనసాగించకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు.
వెల్లంపల్లి ఇంటికి పార్టీశ్రేణులు పెద్దఎత్తున చేరుకుంటున్నాయి. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రిపదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. మంత్రి పదవి ఇవ్వనందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలంటూ ఆయన అనుచరులు ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు. ఇక అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కరణం ధర్మశ్రీ అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ అభిమానులు రోడ్డుపై సీఎం జగన్ దిష్టిబొమ్మతో పాటు టైర్లను దగ్ధం చేసారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రిపదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజీనామాకు సిద్దమయ్యారు.
Andhra Pradesh Apr 11, 2022, 11:12 AM IST
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలతో పాటు మంత్రిపదవులు కోల్పోయిన వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు, పాత మంత్రుల అనుచరులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి కోల్పోడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దపడ్డారు. పార్టీ తరపున తనతో చర్చించడానికి వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణకు సుచరిత స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖ అందచేసారు. అయితే భేటీ అనంతరం మోపిదేవి వెళుతుండగా ఆయన కారును సుచరిత అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది
Andhra Pradesh Apr 11, 2022, 10:03 AM IST
అమరావతి: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమయ్యింది.
Andhra Pradesh Apr 7, 2022, 5:14 PM IST
అమరావతి: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమయ్యింది.
Andhra Pradesh Apr 7, 2022, 5:11 PM IST
వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ విధానాలతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటోందని... ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక పరిస్థితి తప్పదని టిడిపి చీఫ్ చంద్రబాబు హెచ్చరించారు.
Andhra Pradesh Apr 4, 2022, 5:06 PM IST
అమరావతి: వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు.
Andhra Pradesh Apr 4, 2022, 10:42 AM IST
అమరావతి: 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ వంటి కీలక పోస్టుల్లో అధికారులను కూడా నియమించింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో అధికారులు పదవీస్వీకరణలో పాత, కొత్తజిల్లాల్లో కోలాహలం మొదలయ్యింది. కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మచిలీపట్నం బెల్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇక ఎన్టిఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ భాద్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా ఎస్పీగా రవి శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట లోని నూతన ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh Apr 4, 2022, 9:59 AM IST
ఏపీలో పదోతరగతి సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఆ పాఠాలు చదివిన విద్యార్థులు వాటిని మినహాయించి పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Apr 4, 2022, 7:49 AM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు.
Andhra Pradesh Apr 3, 2022, 11:33 AM IST
ఏపీ రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలన్న హైకోర్టు తీర్పుపై సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అమరావతిలో పనులు మొదలుపెట్టేందుకు 8 నెలల సమయం పడుతుందని తెలిపింది.
Andhra Pradesh Apr 2, 2022, 8:05 PM IST
అమరావతి రాజధాని విషయంలో తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 190 పేజీలతో కూడిన అఫిడవిట్ను సీఎస్ సమీర్ శర్మ హైకోర్టుకు సమర్పించారు.
Andhra Pradesh Apr 2, 2022, 4:04 PM IST
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో అన్ని వర్గాలకు ప్రాథాన్యత వుంటుందన్నారు.
Andhra Pradesh Apr 2, 2022, 3:11 PM IST
అమరావతి: కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుంది... కానీ దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టేలా వుందని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష అన్నారు. పేదల నడ్డివిరిచేలా పెంచిన విద్యుత్ బిల్లులను వెంటనే తగ్గించకపోతే టిడిపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని శిరీష స్పష్టం చేసారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని విద్యుత్ భవనం ఎదుట టిడిపి శ్రేణులు నిరసన చేపట్టాయి. జగన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ బాదుడే బాదుడు అంటూ నినదిస్తూ నిరసన గళం వినిపించారు.
Andhra Pradesh Apr 1, 2022, 4:05 PM IST
అమరావతి: వరుస ఆందోళనలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టిడిపి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో కల్తీ మద్యంపై ఆందోళనలు చేపట్టిన టిడిపి తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన బాట పట్టింది. ఈ క్రమంలో సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల బారం మోపడాన్ని నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న నిరసన చేపట్టారు. పూర్వకాలంలో వెలుతురు కోసం ఉపయోగించే లాంతర్లను పట్టుకుని మంగళగిరిలోని టిడిపి కార్యాలయానికి చేరకున్నారు. అంధకార ప్రదేశ్, బాదుడే... బాదుడు అని రాసిన స్టిక్కర్లను అతికించిన లాంతరను పట్టుకుని లోకేష్ నిరసన చేపట్టారు.
Andhra Pradesh Mar 31, 2022, 5:27 PM IST
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసిపి ప్రజానిధులు బాహాబాహీకి దిగారు.
Andhra Pradesh Mar 31, 2022, 2:27 PM IST