Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధానికి చేరిన అమరావతి ఉద్యమం... డిల్లీ చేరుకున్న రైతులు, మహిళలు


అమరావతి: వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు. 

First Published Apr 4, 2022, 10:42 AM IST | Last Updated Apr 4, 2022, 10:42 AM IST


అమరావతి: వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు. ఈ మేరకు బిల్డ్ అమరావతి నినాదంతో విజయవాడ నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి పయనమయ్యారు. నిన్న (ఆదివారం) తెల్లవారుజామున విజయవాడ రైల్వేస్టేషన్ లో ''సేవ్ అమరావతి-బిల్డ్ అమరావతి'' నినాదాలు చేస్తూ రైలెక్కిన రాజధాని రైతులు ఇవాళ . డిల్లీ చేరుకున్నారు. డిల్లీ రైల్వేస్టేషన్లో కూడా అమరావతికి మద్దతుగా రైతులు, మహిళలు నినాదాలు చేసారు. ఇవాళ్టి నుండి డిల్లీలో రాజకీయ ప్రముఖులను కలిసి అమరావతికి మద్దతివ్వాలని కోరనున్నారు.