11:44 PM (IST) May 08

India-Pakistan Border Tensions: జైసల్మేర్, అఖ్నూర్‌లో ఇద్దరు పాకిస్థానీ యుద్ధ విమానం పైలట్లను పట్టుకున్న భారత్

India-Pakistan Border Tensions: భారత సైన్యం ఇద్దరు పాకిస్థానీ  యుద్ధ విమానం పైలట్లను జైసల్మేర్, అఖ్నూర్‌లలో పట్టుకున్నాయి.

పూర్తి కథనం చదవండి
11:33 PM (IST) May 08

india pakistan: భార‌త్ కు అండ‌గా ప్ర‌పంచ దేశాలు.. వివిధ దేశాల అధినేత‌లతో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్

india pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో భార‌త  విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఫోన్ లో మాట్లాడారు. అమెరికాతో పాటు భార‌త్ కు అనేక దేశాలు మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి
11:07 PM (IST) May 08

Operation Sindoor2: పాకిస్థాన్ పైల‌ట్‌ను స‌జీవంగా ప‌ట్టుకున్న భార‌త ఆర్మీ..

పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీకారంగా భార‌త్‌పై దాడుల‌కు దిగుతోంది. ఇందులో భాగంగానే జ‌మ్ముపై దాడి చేసింది. 
 

పూర్తి కథనం చదవండి
10:43 PM (IST) May 08

India vs pakistan: చైనా చెత్త స‌ర‌కు.. పాకిస్థాన్ దాడి చేసిన రాకెట్లు వెర్రీ చీప్

పాకిస్తాన్ ఉగ్ర దాడుల పరంపరలో మరో ఘట్టంగా జమ్మూ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. సత్వారి, సాంబా, ఆర్‌ఎస్‌పురా, అర్ణియా ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత భద్రతా బలగాలు పూర్తిగా అడ్డుకున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
 

పూర్తి కథనం చదవండి
10:38 PM (IST) May 08

Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్.. ఎమ్మెల్యే పదవి ఊడింది

Obulapuram mining case: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.

పూర్తి కథనం చదవండి
10:18 PM (IST) May 08

Pakistan attack on India: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. ఈ రాత్రి ఏం జరగనుంది?

పాకిస్థాన్ దాడితో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని పాకిస్థాన్ యుద్ధ విమానాలతో రెచ్చిపోతోంది. జమ్ముతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడుల చేస్తోంది. దీంతో ఈ రోజు రాత్రి ఏం జ‌ర‌గ‌నుంద‌న్న ఉత్కంఠ అంద‌రిలోనూ నెల‌కొంది. 
 

పూర్తి కథనం చదవండి
10:14 PM (IST) May 08

india pakistan tension: పాక్ దుశ్చ‌ర్య.. జ‌మ్మూపై దాడులు.. పంజాబ్ vs ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ ర‌ద్దు

india pakistan tension: పాక్ కయ్యానికి కాలు దువ్వింది. జ‌మ్మూపై దాడులు చేసింది. దీనిని భారత్ ధీటుగా ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే పంజాబ్ vs ఢిల్లీ మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ర‌ద్దు చేశారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకన్నారు. 

పూర్తి కథనం చదవండి
10:08 PM (IST) May 08

కొత్త పోప్ ఎన్నిక: వాటికన్ వెల్లడి

శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ, సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గుమిగూడిన ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారు

పూర్తి కథనం చదవండి
09:59 PM (IST) May 08

india pakistan tension: బ్లాకౌట్.. స‌రిహ‌ద్దులో టెన్ష‌న్ టెన్ష‌న్... పాక్ కు భారత్ షాక్

india pakistan tension: గురువారం రాత్రి పాకిస్తాన్ భారత్ పై దాడులకు పాల్పడగా.. పాక్ దాడులను భారత్ డిఫెన్స్ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. దాడుల నేపథ్యంలో సరిహద్దులో ప్రాంతాల్లో బ్లాకౌట్ కొనసాగుతోంది. 
 

పూర్తి కథనం చదవండి
09:34 PM (IST) May 08

Pakistan attack on India: పాక్‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇస్తున్న భార‌త్‌.. యుద్ధ విమానాల కూల్చివేత

పాకిస్థాన్ చ‌ర్య‌ల‌కు భార‌త్ ధీటుగా స్పందిస్తోంది. జ‌మ్ములో ప‌లు ప్రాంతాల‌ను టార్గెట్ చేసుకొని దాడుల‌కు దిగిన పాకిస్థాన్ యుద్ధ‌విమాల‌ను కూల్చి వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3 యుద్ధ విమానాల‌ను కూల్చి వేసిన‌ట్లు తెలుస్తోంది. 
 

పూర్తి కథనం చదవండి
09:19 PM (IST) May 08

ఇదీ పాకిస్తాన్ అసలురూపం.. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా!

ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలను ఆయన మరోసారి బయటపెట్టారు.  

పూర్తి కథనం చదవండి
09:11 PM (IST) May 08

Jammu: పాకిస్థాన్ దుశ్చ‌ర్య‌.. రాకెట్ల‌తో దాడి, బ్లాక్ అవుట్‌లో జ‌మ్మూ

పాకిస్థాన్ బరితెగిస్తోంది. ఉగ్రవాదులను టార్గెట్ చేసి భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ని చేపడితే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం జమ్ములోని పలు చోట్ల రాకెట్లతో దాడి చేసింది. 

పూర్తి కథనం చదవండి
09:05 PM (IST) May 08

ఇదెక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టంరా బాబు... చైనా సరుకును నమ్ముకుంటే పాక్ కు ఇలాంటి షాకులే

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న చైనా తయారీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం డ్రోన్ దాడితో ధ్వంసం చేసింది. దీంతో చైనా ఆయుధాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పూర్తి కథనం చదవండి
09:03 PM (IST) May 08

Telangana: ములుగులో ల్యాండ్‌మైన్ పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు జ‌వాన్లు మృతి

Telangana police killed in Maoist landmine blast: ములుగు జిల్లాలో మావోయిస్టుల ల్యాండ్‌మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసుల ప్రాణాలు కోల్పోయారు.
 

పూర్తి కథనం చదవండి
09:00 PM (IST) May 08

అల్లా కాపాడాలని కన్నీళ్లు పెట్టుకున్న పాక్ ఎంపీ.. వైరల్ అవుతోన్న వీడియో

భారత ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశాన్ని అల్లా కాపాడాలని ఆయన వేడుకున్నారు.

పూర్తి కథనం చదవండి
08:40 PM (IST) May 08

Holiday : భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు ... రేపు సెలవు

పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. 

పూర్తి కథనం చదవండి
08:12 PM (IST) May 08

Lalu Prasad Yadav: లాలూ ప్రస్తాద్ యాదవ్ కు బిగ్ షాక్.. ఈడీ విచారణకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్

land for jobs scam: రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో జరిగిన భూ కుంభకోణం కేసులో ఆయనపై విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.

పూర్తి కథనం చదవండి
07:51 PM (IST) May 08

India-Pakistan tension: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. పాక్ స్టాక్ మార్కెట్ కుదేలు.. ట్రేడింగ్ బంద్ 

Operation Sindoor: భారత్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ దెబ్బ‌కు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప‌కూలింది. 7.2% పతనం కావ‌డంతో ట్రేడింగ్ నిలిపివేశారు. కరాచీ, లాహోర్‌లో డ్రోన్ పుకార్లతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. 

పూర్తి కథనం చదవండి
07:38 PM (IST) May 08

Operation Sindoor: భారత్ ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్లుందే ... అందుకే మోదీ ఆయనతో భేటీ అయ్యారా?

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో భేటీ అయ్యారు. వీరి భేటి ఆసక్తికరంగా మారింది. 

పూర్తి కథనం చదవండి
07:28 PM (IST) May 08

Saudi Minister: భార‌త్‌కు సెడ‌న్ ఎంట్రీ ఇచ్చిన సౌదీ మంత్రి.. కార‌ణం అదేనా.?

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త వాత‌వ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అన్న అందోళ‌న అంద‌రిలోనూ ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్ఫించింది. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ జూనియ‌ర్ మంత్రి ఉన్న‌ప‌లంగా ఢిల్లీ వ‌చ్చారు. 
 

పూర్తి కథనం చదవండి