MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral Video: క‌దిలే రైలులో శోభనం గది.. పండ్లు, పూల‌తో హంగామా. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: క‌దిలే రైలులో శోభనం గది.. పండ్లు, పూల‌తో హంగామా. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: కొత్తగా పెళ్లైన జంట కోసం భారతీయ రైల్వే ఫస్ట్ ఏసీ కూపే (చిన్న క్యాబీన్‌)ను పూలు, బెలూన్లు, లైట్లు, ప్రత్యేక అలంకరణతో హనీమూన్ సూట్‌లా మార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట కొత్చ చ‌ర్చ‌కు తెర తీసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 08 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హనీమూన్ గదిలా మారిన రైల్వే కూపే
Image Credit : Siddharth's Echelon/X

హనీమూన్ గదిలా మారిన రైల్వే కూపే

రైలులో కూపే (Coupe) అంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా ఉండే ఒక ప్రత్యేకమైన చిన్న క్యాబిన్. వైర‌ల్ అవుతోన్న వీడియోలో ఫస్ట్ ఏసీ రెండు బెర్త్‌ల కూపేను పూర్తిగా కొత్త రూపంలో అలంకరించారు. గోడలకు ఎరుపు రంగు కర్టెన్లు, పసుపు రంగు ఫెయిరీ లైట్లు, హార్ట్ షేప్‌లోని బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. రైల్వే అందించే బెడ్‌షీట్లు, దుప్పట్ల స్థానంలో ప్రత్యేకంగా తీసుకొచ్చిన బెడ్‌షీట్ల‌ను ఉపయోగించారు. వాటిపై గులాబీ రేకులు చ‌ల్లారు. ఇలా ట్రైన్ బోగిలో రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వీడియో వైరల్.. రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు
Image Credit : Siddharth's Echelon/X

వీడియో వైరల్.. రెండు వర్గాలుగా విడిపోయిన నెటిజన్లు

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కొందరు కొత్త జంట కోసం చేసిన ఈ ప్రత్యేక ఏర్పాటును అభినందిస్తూ, ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మార్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రజా రవాణా వాహనాన్ని వ్యక్తిగత వేడుకల కోసం ఇలా మార్చడం సరైంది కాదని అభిప్రాయ‌ప‌డుతున్నారు. రైల్వే కోచ్‌ను హోటల్ గదిలా అలంకరించడం నిబంధనలకు విరుద్ధమని కొందరు విమ‌ర్శిస్తున్నారు.

Related Articles

Related image1
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Related image2
Wine Tips: వైన్‌లో ఏం క‌లుపుకొని తాగాలి.? వైన్ తాగే స‌రైన విధానం ఏంటో 90 శాతం మందికి తెలియ‌దు
35
భద్రతపై వ్యక్తమైన ఆందోళనలు
Image Credit : Siddharth's Echelon/X

భద్రతపై వ్యక్తమైన ఆందోళనలు

ఈ అలంకరణలో విద్యుత్ లైట్లు, అదనపు వస్త్రాలు, ఇతర అలంకరణ సామగ్రిని ఉపయోగించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రయాణం ముగిసిన తర్వాత బెలూన్లు, పూలు, ఇతర అలంకరణ వస్తువులను అక్కడే వదిలేస్తే శుభ్రత సమస్యలు తలెత్తుతాయని కూడా వ్యాఖ్యానించారు. ప్రజా ఆస్తిని ఉపయోగించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు సూచించారు.

45
స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది..
Image Credit : Siddharth's Echelon/X

స‌పోర్ట్ కూడా ల‌భిస్తోంది..

మరోవైపు, ఆ జంటకు స‌పోర్ట్‌గా కూడా చాలా మంది స్పందించారు. వారు కూపే తలుపు మూసుకుని తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తార‌ని, ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది అయితే హోటల్ కంటే ఇలాంటి ప్రయాణ అనుభవమే మరింత ప్రత్యేకంగా ఉంటుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించే జంటకు ఇది మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.

I don’t know if this is legal to do but lord please keep dehatis away from first AC.

Railways has only this left as a decent option to travel. They have penetrated inside Vande Bharat too.

No mood to fight dehatism even in First AC now. Suhagraat tourism wasn’t on 2026 cards. pic.twitter.com/aMI7CODhDd

— Siddharth's Echelon (@SiddharthKG7) July 8, 2026

55
రైల్వే నుంచి ఇంకా స్పందన లేదు
Image Credit : Siddharth's Echelon/X

రైల్వే నుంచి ఇంకా స్పందన లేదు

ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతున్నప్పటికీ, దీనిపై భారతీయ రైల్వే నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రజా ఆస్తి వినియోగం, భద్రతా నిబంధనలు, అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన నిబంధనలు రైల్వేలో అమల్లో ఉన్నప్పటికీ, ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత లేదు. ఈ వైరల్ వీడియోతో వ్యక్తిగత వేడుకలకు హద్దులు ఎక్కడ ఉండాలి? ప్రజా ఆస్తిని ఎలా వినియోగించాలి? భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అనే అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ న‌డుస్తోంది. అయితే ఈ రైలుకు ఎక్కడిది.? ఈ సంఘటన ఎక్కడ జరిగింది.? అన్న వివరాలు మాత్రం తెలియలేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?
Recommended image2
Now Playing
ఆస్ట్రేలియాకు బయల్దేరిన ప్రధాని మోదీ | PM Modi emplanes for Melbourne, Australia
Recommended image3
Now Playing
ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
Related Stories
Recommended image1
మ‌రో హైటెక్ సిటీగా మారుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతం.. కాగ్నిజెంట్ సెజ్ ఏర్పాటు
Recommended image2
Wine Tips: వైన్‌లో ఏం క‌లుపుకొని తాగాలి.? వైన్ తాగే స‌రైన విధానం ఏంటో 90 శాతం మందికి తెలియ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved