Modi Food: ప్రధాని మోదీ ప్రతిరోజూ ఇష్టంగా తినే అయిదు ఆహారాలు ఇవే
Modi Food: ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తారు. ఆయన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా ఆయన మెనూలో కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

ప్రధాని మోదీ తినే ఆహారాలు
ప్రధాని నరేంద్ర మోదీ తన ఆహారపు అలవాట్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఆయన సంప్రదాయ భారతీయ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. అందులో మునగాకు, మఖానా, చిరుధాన్యాలు, సీ బక్థార్న్, నల్ల బియ్యం, భారతీయ అవకాడో వంటివి ఉన్నాయి. వీటిలో మునగాకుతో చేసే పరోటాలు తనకు ఇష్టమని మోదీ గతంలో ఎన్నో సార్లు చెప్పారు. మునగాకులో ఇనుము, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే దీనిని పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంగా చెబుతారు.
మఖానా అంటే చాలా ఇష్టం
మోదీ తినే ఆరోగ్యకరమైన ఆహారం మఖానా. దీనిని ఫాక్స్నట్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. కాల్షియం కూడా లభిస్తుంది. అందుకే ప్యాకెట్ స్నాక్స్కు బదులుగా మఖానాను తీసుకోవచ్చని మోదీ పలుమార్లు సూచించారు. ఇక చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి ఉన్నాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో వేల ఏళ్లుగా వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సమయంలో వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచ వేదికలపై కూడా ప్రస్తావించారు.
సీ బక్ థార్న్ ఎంతో మంచిది
హిమాలయ ప్రాంతాల్లో కనిపించే సీ బక్థార్న్ కూడా మోదీ ఇష్టంగా తింటారు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అయితే దీనిపై ఉన్న ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇక నల్ల బియ్యంలో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలాగే భారతీయ అవకాడోలు కూడా ఇటీవల ప్రజల్లో ఆదరణ పెంచుకుంటున్నాయి. పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఆహారాలను రోజువారీ భోజనంలో తగిన మోతాదులో చేర్చుకోవచ్చు.

