Sudha Murthy: ఆ రోజు సుధామూర్తి చేసిన ఒక్క పని.. చరిత్రనే మార్చేసింది..!
Sudha Murthy: ఏ అమ్మాయి చేయని ధైర్యం సుధామూర్తి చేసింది. ఆమె పెట్టిన ఒకే ఒక్క ఉత్తరం.. చరిత్రనే మార్చేసింది. ముఖ్యంగా, అమ్మాయిల భవిష్యత్తును మార్చేసింది. ఇంతకీ సుధామూర్తి ఏం చేశారు..?

మహిళల తలరాత మార్చిన సుధామూర్తి
మన దేశంలో గొప్ప రచయితల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్ సుధామూర్తి కూడా ఒకరు. ఆమె గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా ఎన్నో పుస్తకాలను రచించారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి? పిల్లల పెంపకం గురించి ఆమె చాలా గొప్పగా వివరించారు. అయితే.. ఆమె కాలేజీ అయిపోయిన సమయంలో చేసిన ఒక పని.. చాలా మంది అమ్మాయిల భవిష్యత్తును మార్చేసింది అంటే నమ్ముతారా? ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు.. ఉద్యోగాలు చేస్తూ.. తమ కాళ్లమీద నిలపడుతున్నారంటే ఒక రోజు సుధామూర్తి చేసిన పనే కారణం. మరి, ఆమె చేసిన పని ఏంటి? అమ్మాయిల తలరాతలను ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుధామూర్తి..
మన దేశంలో గొప్ప రచయితల్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్ సుధామూర్తి కూడా ఒకరు. ఆమె గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా ఎన్నో పుస్తకాలను రచించారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి? పిల్లల పెంపకం గురించి ఆమె చాలా గొప్పగా వివరించారు. అయితే.. ఆమె కాలేజీ అయిపోయిన సమయంలో చేసిన ఒక పని.. చాలా మంది అమ్మాయిల భవిష్యత్తును మార్చేసింది అంటే నమ్ముతారా? ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు.. ఉద్యోగాలు చేస్తూ.. తమ కాళ్లమీద నిలపడుతున్నారంటే ఒక రోజు సుధామూర్తి చేసిన పనే కారణం. మరి, ఆమె చేసిన పని ఏంటి? అమ్మాయిల తలరాతలను ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం..
ఉత్తరం మార్చేసిన జీవితం..
కొద్ది రోజుల వ్యవధిలోనే సుధామూర్తికి టెలికాం సంస్థ నుంచి ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది. ఆమె కంపెనీ ఖర్చుతో పూణే వెళ్లి, టెక్నికల్ ఇంటర్వ్యూలో తన టాలెంట్ నిరూపించుకున్నారు. అప్పటి వరకు ఫ్యాక్టరీల్లో మహిళలను నియమించుకోకూడదు అని ఆ కంపెనీలో రూల్ ఉండేది. కానీ, సుధామూర్తి ఆ రూల్ ని మార్చేశారు. తన తెలివితో అందరి మనసులు గెలచుకున్నారు.
టెలికాం సంస్థలో తొలి మహిళా ఇంజినీర్...
ఇంటర్వ్యూ తర్వాత, సుధామూర్తి ఒక టెలికాం సంస్థ షాప్ ఫ్లోర్ లో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా రికార్డు సృష్టించారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత పారిశ్రామిక రంగంలో మహిళలకు కొత్త అవకాశాలు రావడానికి ఆమె వేసిన తొలి మెట్టు. ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు చేయడానికి ఆరోజు ఆమె వేసిన అడగే కారణం. కాగా, కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత.. ఆమె తన భర్తతో కలిసి 1982లో ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇన్ఫోసిన్ ప్రారంభిస్తున్న సమయంలో..జేర్డీ టాటా.. సుధామూర్తికి సలహా ఇచ్చారట. ‘ ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. విజయం సాధించినప్పుడు, సమాజానికి తిరిగి సేవ చేయి’ అని చెప్పారట. ఆమె మాటలను సుధామూర్తి తన జీవితాంతం గుర్తించుకొని.. ఫాలో అవుతున్నారు.

