- Home
- Entertainment
- Mega 158: ఎట్టకేలకు ప్రాణస్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. 35 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు
Mega 158: ఎట్టకేలకు ప్రాణస్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. 35 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు
చిరంజీవి ప్రస్తుతం మెగా 158 చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరింత ఉత్సాహంతో కొత్త సినిమాలకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చింది. ఆ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
కీలక పాత్రలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు
చిరంజీవి 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవి ప్రాణ స్నేహితుడు ఒకరు కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆ ప్రాణ స్నేహితుడు మరెవరో కాదు శరత్ కుమార్.
35 ఏళ్ళ తర్వాత అతడికి అవకాశం
35 ఏళ్ళ తర్వాత చిరంజీవి, శరత్ కుమార్ నటించబోతున్నారు అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. 35 ఏళ్ళ క్రితం వీళ్ళిద్దరూ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ ఆ మూవీ తర్వాత చిరంజీవి సినిమాల్లో శరత్ కుమార్ నటించలేదు.
గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్
దీనిగురించి ఓ ఇంటర్వ్యూలో అడిగితే అవకాశం, సరైన సినిమా రాలేదు అని శరత్ కుమార్ అన్నారు. గ్యాంగ్ లీడర్ తోపాటు స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ మూవీలో కూడా శరత్ కుమార్ నటించారు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడప్పుడూ తెలుగులో శరత్ కుమార్ కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కానీ 35 ఏళ్లుగా చిరంజీవి సినిమాలో నటించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా ఇద్దరూ ప్రాణ స్నేహితులు.
శరత్ కుమార్ ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం
తాను కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎంతో సాయం చేశారు అని శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శరత్ కుమార్ ఫ్యామిలీతో చిరంజేవికి ప్రత్యేక అనుబంధం ఉంది. శరత్ కుమార్ సతీమణి రాధికా చిరంజీవితో అప్పట్లో అత్యధిక చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరు, బాబీ చిత్రంలో శరత్ కుమార్ పాత్ర మల్టీ షేడ్స్ ఉన్న నెగిటివ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తెగా నటిస్తున్నారు.

