MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Devatha: కమల బిడ్డను చూడడానికి వచ్చిన రుక్మిణి... కొత్త ప్లాన్ వేసిన మాధవ్!

Devatha: కమల బిడ్డను చూడడానికి వచ్చిన రుక్మిణి... కొత్త ప్లాన్ వేసిన మాధవ్!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 19వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Aug 19 2022, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... రుక్మిణి, దేవుడమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి కమల బిడ్డని ఎత్తుకుంటుంది. అందరూ రుక్మిణిని చూసి ఆనందపడతారు. చూశావా నువ్వు వచ్చిన వెంటనే బిడ్డ ఎలా ఏడుపాపేసిందో అని దేవుడమ్మ రుక్మిణి తో అంటుంది.తర్వాత ఇదంతా నా బ్రమ అని అనుకుంటుంది రుక్మిణి. అప్పుడు భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఆ పాపని ఎత్తుకొని లాలిస్తూ  ఆనందపడుతుంది. ఈ లోగా దేవుడమ్మ, మేము మీకు చెప్పలేదు కదా మరి నీకు ఎలా తెలిసింది భాగ్యమ్మ అని  అడుగుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు భగ్యమ్మ, బయట వాళ్లందరూ ఆఫీసర్ సార్ ఇంట్లో బిడ్డ పుట్టింది అని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్ సార్ ఇంట్లో బిడ్డ పుట్టిందంటే కమలకే కదా అందుకే వెంటనే పరిగెత్తుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు భాగ్యమ్మ ఆ బిడ్డని కిటికీ దగ్గరకు తీసుకువెళ్లి రుక్మిణికి చూపిస్తుంది. రుక్మిణి ఆ బిడ్డ తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తుంది. దేవుడమ్మ వాళ్ళు అటువైపు చూసేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుక్మిణి. అటువైపు ఎందుకు వెళ్లావు భాగ్యమ్మ అని దేవుడమ్మ అడుగుతుంది.
 

37

అప్పుడు, ఊరికే అలాగా లాలిస్తూ తిప్పుతున్నాను అని చెప్పి తిరిగి కమల పక్కన పడుకోబెట్టొస్తుంది భాగ్యమ్మ. రుక్మిణి ఇదంతా చూసి ఎంతో ఆనందపడుతుంది.ఆ తర్వాత సీన్లో రుక్మిణి పాలు పట్టుకొని హాల్లో నుంచి వెళ్తూ ఉండగా మాధవ్ అక్కడికి వచ్చి, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాడు.దానికి రుక్మిణి నీతో మాట్లాడే అవసరం నాకు  లేదు అని అంటుంది.నీకు ఎందుకు ఇంత ధైర్యం అని మాధవ్ అడగగా,అందరూ దేవతల కొలిచే దేవుడమ్మ కోడలిని, ఊరందరికీ ఆఫీసర్ సారైనా ఆదిత్య  భార్యని,నాకు ఈమాత్రం పొగరుండాలి కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

47

ఆ తర్వాత సీన్లో కమల బిడ్డని లాలిస్తూ ఆనంద పడుతూ ఉంటుంది.దూరం నుంచి చూస్తున్న దేవుడమ్మ, వాళ్ళ భర్త ఇద్దరు పాపం సత్యకి బిడ్డ లేకుండా పోయిందే అని బాధపడుతూ ఉంటారు. కమలికి బిడ్డ పుట్టింది కదా తనకి బారసాలు చేయాలి. మనకి సత్య ఎంతో కమల కూడా అంతే. ఘనంగా బారసాలు జరిపించాలి పైగా వాళ్ళు మనల్ని నమ్ముకుని ఉన్నారు అని అనుకుంటారు భాగ్యమ్మ దంపతులు.ఆ తర్వాత సీన్లో దేవి అన్న మాటలను గుర్తుతెచ్చుకొని రుక్మిణి ఇంటి బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఈలోగా భాగ్యమ్మ అక్కడికి వస్తుంది.
 

57

ఈ సమయంలొ ఏం ఆలోచిస్తున్నావ్ అమ్మ అని అడుగుతుంది.బిడ్డని, పెనిమిటిని ఎలా ఒకటి చేయాలో అర్థం కావడం లేదు. నాయన కావాలి అని దేవి అడుగుతుంది కానీ మాధవ్ మాత్రం దేవి మనసులో వాళ్ళ నాయన మీద విషం నింపేశాడ. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారు అని భాగ్యముతో తన బాధ చెప్పుకుంటుంది. అప్పుడు భాగ్యమ్మ, నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావ్, నేను నా బిడ్డల కోసం ఆలోచిస్తున్నా ఎప్పటికైనా మీ ముగ్గురు పిల్లలుని ఒక ఇంట్లో చూడాలన్నది నా ఆశ, నువ్వు ప్రాణాలతో ఉన్నా లేనట్టే ఉన్నావు.
 

67

 రేపు కమల బిడ్డకి భారసాలు చేస్తున్నారు. ఇంట్లో అందరూ ఉంటారు కానీ నువ్వు ఉండవు కదా.సొంత అక్క బిడ్డకి భారసాలు జరుగుతున్నప్పుడు చిన్నమ్మ లేకపోవడం లోటు కాదా! అని భగ్యమ్మ అంటుంది.ఆ తర్వాత సీన్లో జానకమ్మ వాళ్ళ పిల్లలిద్దరికీ భోజనం తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు.ఇంతటిలో మాధవ్ అక్కడికి వస్తాడు అదే సమయంలో రుక్మిణి కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు మాధవ్ జానకమ్మ దగ్గరికి వెళ్లి పిల్లలకు పెట్టినట్టు నాకు కూడ గోరుముద్దలు పెట్టు అమ్మ.
 

77

చిన్నప్పుడు నా పదో తరగతి పరీక్షలకు నువ్వు గోరుముద్ద పెడితే పాస్ అవుతాను అనుకున్నాను అలాగే జరిగింది.ఇప్పుడు కూడా నేను ఒక పరీక్షలో పాల్గొనాలి అది మంచే జరగాలి అని నాకు గోరు ముద్దలు పెట్టి ఆశీర్వదించండి అని రుక్మిణి వైపు అదోలా చూసి జానకమ్మతో అంటాడు మాధవ్. ఏం పరీక్షలు అని అడగగా జీవిత పరీక్షలు అని మాధవ్ అంటాడు. అప్పుడు దేవి, నాయనా నువ్వు ఎందులోనైనా పాస్ అవుతావు అని అంటుంది. అప్పుడు మాధవ్, దేవమ్మ కూడా అంటుంది కదా నువ్వు ఆశీర్వదించమ్మా అని అంటాడు మాధవ్. ఈ మాధవ్ సార్ మళ్లీ ఏమి కొత్త ప్లాన్ వేసాడు అని రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image3
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved