- Home
- Entertainment
- Missing Meghana: హీరోయిన్తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Missing Meghana: హీరోయిన్తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Missing Meghana: మిస్సింగ్ మేఘన సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్ము అభిరామి మూవీ ప్రమోషన్స్ కి దూరంగా ఉండటంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అసలు జరిగిందేంటో ఓపెన్గా బయటపెట్టాడు.

హీరోయిన్తో గొడవపై మిస్సింగ్ మేఘన దర్శకుడు క్లారిటీ
రామ్ కార్తిక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా వంటి వారు ప్రధాన పాత్రధారులుగా `మిస్సింగ్ మేఘన` మూవీ రూపొందింది. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపి మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు హీరోయిన్కి సంబంధించిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. మేఘన పాత్రలో నటించిన అమ్ము అభిరామి ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు.
దర్శకుడు మాట్లాడుతూ, `చిన్న చిన్న గొడవలు జరగడం ప్రతి సినిమా విషయంలో ఉంటుంది. మా మూవీ విషయంలో కూడా ఉన్నాయి. హీరోయిన్కి ఇంకా పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు. దీంతో ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంది, అదే తప్ప మరో సమస్య కాదు అని తెలిపారు దర్శకుడు. దీనికి హీరో రియాక్ట్ అవుతూ, దర్శకుడు చెప్పింది నిజం కాదని, ఆమె వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉందని, డేట్స్ కుదరక రాలేకపోతుందని వెల్లడించారు.
చిత్ర దర్శకుడు వాచస్పతి ఇంకా మాట్లాడుతూ, `ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కథ. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన చిత్ర బృందం అందరికీ థాంక్స్. ఈ నెల 18న విడుదల కానున్న మిస్సింగ్ మేఘన సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మిస్సింగ్ మేఘన సరికొత్తగా ఉంటుంది. ప్రారంభం నుంచి ఎంగేజ్ చేస్తుంది. సినిమాలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మాత్రమే కాదు, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, అది ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ లు, టర్న్ లు చాలానే ఉన్నాయి. థియేటర్లో సర్ప్రైజ్ అవుతారు` అని తెలిపారు.
థ్రిల్కి గురి చేసే మిస్సింగ్ మేఘన
నటుడు రామ్ కార్తీక్ మాట్లాడుతూ, `నా తొలి చిత్రం నుండి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. ధ్రువన్ పాటలు వల్ల సినిమా ప్రేక్షకులకి బాగా వెళ్ళింది. పాటలు పాడిన గాయకులకు థాంక్స్. నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అయిన అందరితో కలిసి ఈ సినిమాలో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. నాకు బెక్కం వేణు గోపాల్ గారు మంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా తోటి నటుడు అంకిత్ తో పని చేయడం బాగా అనిపించింది. అమ్ము అభిరామి తో ఇది నా రెండవ సినిమా. దర్శకులు ఈ సినిమాకు చాలా కష్టపడి పని చేశారు. సినిమా కచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్కి గురి చేస్తుంది. మాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నా` అని అన్నారు.
నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ, `సంవత్సరం తర్వాత మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం దర్శకుడు వాచస్పతి గారు, ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు. సినిమాకు పని చేసిన బృందానికి, నిర్మాతలకు థాంక్స్. రామ్ కార్తీక్ తో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. మీడియా తలుచుకుంటే ఏం చేయగలదో నా గత సినిమాలకు నేను చూసాను, ఈ సినిమాకు కూడా మీడియా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను` అని వెల్లడించారు. ఇందులో గెస్ట్ గా నిర్మాత దామోదర ప్రసాద్, బెక్కెం వేణుగోపాల్తోపాటు ధృవన్, సింగర్ సాకేత్, నటుడు గోపరాజు రమణ వంటి వారు పాల్గొన్నారు.

