- Home
- Entertainment
- OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ నోబడి మూవీ ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఈ సినిమా థియేటర్స్ లో జస్ట్ యావరేజ్ గా మాత్రమే ఆడింది. ఓటీటీలో ఇంతటి క్రేజీ రెస్పాన్స్ కి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

I Nobody
మలయాళం క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి మూవీలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై, పృథ్వీరాజ్ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి.
థియేటర్స్ లో యావరేజ్
ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఐ నోబడీ జూలైలో విడుదలైన జస్ట్ యావరేజ్ గా నిలిచింది. సాధారణంగా మలయాళీ థ్రిల్లర్ సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఐ నోబడి మాత్రం థియేటర్స్ లో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. దీనికి కారణం సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కథ బాగా స్లో అవుతుంది.
ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్
అయితే ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పృథ్వీరాజ్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. జనాలు ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. ఓటీటీలో ఊహకందని రెస్పాన్స్ దక్కుతోంది. కామన్ మాన్ సిస్టమ్ కి వ్యతిరేకంగా చేసే పోరాటానికి ఓటీటీలో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.
కథ ఏంటంటే
రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య పిల్లలతో జీవిస్తుంటాడు. రాజీవ్, అతని భార్య మధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబ సమస్యల్లో ఉన్న రాజీవ్ అనుకోకుండా ఒక బ్యాంక్ దోపిడీ వ్యవహారంలో చిక్కుకుంటాడు. దోపిడీ చేసిన వాళ్ళు అందరూ యాక్సిడెంట్ లో మరణిస్తారు. వాళ్ళు దోచిన 17 కోట్లు మాత్రం అదృశ్యం అవుతాయి. దీనితో ప్రజలు, మీడియా, పోలీసులు, రాజకీయ నాయకులు, ముఠాలు అంతా రాజీవ్ వద్దే ఆ డబ్బు ఉన్నట్లు అనుమానిస్తారు.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ వ్యవహారం వల్ల అతడి కుటుంబం ప్రశాంతత కోల్పోతుంది. తన వద్ద డబ్బు లేదు అని నిరూపించుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాజీవ్ ఎలాంటి పథకం రచించాడు ? ఎలా పోరాడాడు ? అసలు ఆ డబ్బు ఏమైంది ? అనే విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ మూవీలో పృథ్వీరాజ్ భార్యగా నటి పార్వతి తిరువోతు నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ సినిమాలు కోరుకునేవారు అస్సలు మిస్ కాకుండా చూడండి.

