Jana Nayagan: జన నాయకుడు సినిమా చూస్తూ త్రిష రచ్చ.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
Jana Nayagan: దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా అభిమానులనే కాదు, ప్రముఖులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. త్రిష రచ్చ చేసింది.

థియేటర్లో జన నాయగన్ సందడి
విజయ్ చివరి మూవీ జన నాయగన్ ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. విజయ్ సీఎం అయిన నేపథ్యంలో ఇప్పట్లో సినిమాలు చేసే పరిస్థితి లేదు. మళ్లీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. దీంతో ఈ మూవీని అభిమానులే కాదు, తమిళనాడు ప్రజలు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు థియేటర్లో విజయ్ నామస్మరణం జరుగుతుంది.
థియేటర్లో త్రిష రచ్చ
స్టార్ హీరోయిన్ త్రిష, 'జననాయగన్' సినిమా చూసేందుకు తన స్నేహితురాళ్లతో కలిసి వచ్చారు. చెన్నైలోని కోయంబేడులో ఉన్న ప్రముఖ రోహిణి థియేటర్లో సినిమా విడుదలైన మొదటి రోజే, ఉదయం 11 గంటల షోకి ఆమె సడెన్గా ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న అభిమానులు షాక్ అయ్యారు, ఆనందంతో కేకలు వేశారు. తమిళ స్టార్ హీరోయిన్ అయిన త్రిష, సీఎం విజయ్ సినిమాను చూసేందుకు సాధారణ ప్రేక్షకురాలిలా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. త్రిషను చూసిన ఆనందంలో అభిమానులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Trisha arrives at Rohini Theatre to watch #JanaNayagan! ❤️🎬
The FDFS celebrations get even more exciting as she joins fans to witness Thalapathy Vijay's much-awaited film on the big screen. 🔥🙌#Trisha#JanaNayagan#JanaNayaganFDFS#ThalapathyVijay#Vijaypic.twitter.com/JH2Apw5aGt— TVA Entertainment (@TVA_Ent) July 23, 2026
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి పర్వేజ్ (Emotional Outburst)
మరోవైపు, పుదుక్కోట్టైలోని విజయ్ థియేటర్లో రాష్ట్ర కార్మిక సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జా. మహమ్మద్ పర్వేజ్ 'జననాయగన్' సినిమా మార్నింగ్ షో చూశారు. విజయ్కి వీరాభిమాని అయిన ఆయన, సినిమా మొదలయ్యే ముందు చాలా ఉత్సాహంగా కనిపించారు. అయితే, సినిమా చూస్తున్నప్పుడు మంత్రి పర్వేజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్క్రీన్పై విజయ్ను చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అభిమాన నటుడు ఇకపై సినిమాల్లో నటించడనే బాధతోనే మంత్రి పర్వేజ్ థియేటర్లోనే ఏడ్చేశారని టీవీకే (తమిళగ వెట్రి కళగం) కార్యకర్తలు, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎమోషనల్ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Courtesy : galattadotcom Instagram Page
పండగ చేసుకున్న విజయ్ అభిమానులు
విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన `జన నాయకుడు` మూవీకి కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి విశేష స్పందన లభిస్తుంది. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయినా, విజయ్ అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. వారికిది ఫుల్ మీల్స్ లాంటి మూవీ అవుతుందని చెప్పొచ్చు. మరి కమర్షియల్గా ఈ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

