MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్ ను వదులుకుంటుందా? - ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంచలన నిర్ణ‌యాలు

రిషబ్ పంత్ ను వదులుకుంటుందా? - ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంచలన నిర్ణ‌యాలు

IPL 2025 - Rishabh Pant : భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిష‌బ్ పంత్ ఐపీఎల్ లో ప్రస్తుతం రూ. 16 కోట్ల బ్రాకెట్ లో ఉన్నాడు.  వేలం కోసం ఫ్రాంచైజీలకు కేటాయించిన మొత్తం పర్స్‌తో పాటు బీసీసీఐ నిర్దేశించిన రిటెన్ష‌న్ ధ‌ర మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పంత్ ధ‌ర భారీగా పెరుగుతుంద‌ని క్రికెట్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ సాగుతోంది. 

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 22 2024, 10:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 - Rishabh Pant : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ), ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే, ఐపీఎల్ 2025 కి ముందు మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో దాదాపు అన్ని ఫ్రాంఛైజీల‌లో భారీ మార్పులు క‌నిపించ‌వ‌చ్చు.

ఘోర కారు ప్ర‌మాదంతో దాదాపు ఏడాది కాలం త‌ర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన రిష‌బ్ పంత్ ఐపీఎల్ 2024 తో అద్భుత పున‌రాగ‌మ‌నం చేశాడు. అయితే, రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున రిష‌బ్ పంత్ ఆడ‌టం లేద‌ని జోరుగా క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టి, చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఇతర ఫ్రాంచైజీలలో ఒకదానిలో చేరుతాడనే పుకార్లు  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలానికి ముందు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పంత్ ప‌ట్ల పూర్తి సంతృప్తితో లేని ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌న్ని రిటెన్ష‌న్ చేసుకునే అవ‌కాశం లేద‌ని ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి. 

వికెట్ కీపర్-బ్యాటర్‌ను వ‌దులుకోవాల‌నేది ఆ ఫ్రాంఛైజీ తీసుకున్న త‌ప్పు నిర్ణ‌యంగా ప్ర‌స్తుతం భార‌త్-బంగ్లాదేశ్ టెస్టులో నిరూపించాడు పంత్. సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ సెంచ‌రీ దెబ్బంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫ్రాంఛైజీ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంద‌ని తెలుస్తోంది. 

35
Rishabh Pant

Rishabh Pant

ఢిల్లీ క్యాపిటల్స్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2021లో రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 2020 ఫైనలిస్టులు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతనిని కొనసాగించడం ద్వారా ఆ ప్రణాళికను అమలులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన పంత్ ఐపీఎల్‌లో తిరిగి వచ్చినప్పుడు 446 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ రిటెన్షన్ పిక్‌గా ఉండబోతున్నాడు. గత ఎడిషన్‌కు దూరమైన తర్వాత 2024లో ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చిన పంత్, 40.55 సగటుతో 155 స్ట్రైక్ రేట్‌తో 446 పరుగులు చేశాడు. అయితే, జ‌ట్టును ముందుకు న‌డ‌ప‌డంలో ఫ్రాంఛైజీ సంతోషంగా లేద‌నే వార్త‌లు వ‌చ్చాయి. 

45

అలాగే, రిటెన్ష‌న్ మొత్తానికి సంబంధించి పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య విభేదాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి, అయితే, టాప్ బ్రాకెట్‌లో ఉన్న ఫ్రాంచైజీ ద్వారా పంత్‌ను ఉంచుకుంటారని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ పేర్కొంద‌ని క్రిక్‌బజ్ నివేదిక‌లు పేర్కొన‌డంతో ఈ టాపిక్ కు పుల్ స్టాప్ ప‌డింది. 

ఈ నివేదిక ప్రకారం 2022-24 సైకిల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు జ‌ట్టులో రూ.16 కోట్ల బ్రాకెట్‌లో ఉన్న పంత్ ఆ జ‌ట్టుకు మొదటి రిటెన్ష‌న్ ఎంపికగా ఉంటాడు. అయితే ఫ్రాంఛైజీ పర్స్ మొత్తాన్ని బట్టి పంత్ ధ‌ర మ‌రింత పెరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2021 రెండవ భాగంలో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా కొనసాగిన పంత్.. ఫ్రాంచైజీ భవిష్యత్తుగా పరిగణిస్తూ జ‌ట్టును ముందుకు న‌డిపించే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు పంత్ ను జ‌ట్టుతోనే అంటిపెట్టుకుని ఆ ప్ర‌ణాళిక‌లు, వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. 

55
Rishabh Pant

Rishabh Pant

బీసీసీఐ ఐదు రిటెన్షన్‌లను అనుమతించినట్లయితే రిషబ్ పంత్ తర్వాత ఫ్రాంచైజీకి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు రెండు, మూడో రిటెన్షన్‌లు అవుతారని నివేదిక పేర్కొంది. వీరితో పాటు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు విదేశీ ప్లేయ‌ర్లు కూడా ఈ రిటెన్ష‌న్ లో ఉంటారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల ఆరవ ఎంపిక ఉంటే ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2024 లో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో స‌రిపెట్టుకుంది. అయితే, ఐపీఎల్ మెగా వేలం, రిటెన్ష‌న్ ల‌కు సంబంధించిన నియమాలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు కానీ కొన్ని రోజుల క్రితం ప‌లు రిపోర్టులు సూచించినట్లు ఈ వారంలో ఎప్పుడైనా దీనిపై ప్ర‌క‌ట‌న‌ రావచ్చు. మెగా వేలం నవంబర్ చివరి భాగంలో భారతదేశం వెలుపల జరిగే అవకాశం వుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved