MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లను నమ్మి మోసపోయిన పృథ్వీ షా.. నమ్మించి మోసం చేశారని ఫైర్ అయిన ముంబై బ్యాటర్

వాళ్లను నమ్మి మోసపోయిన పృథ్వీ షా.. నమ్మించి మోసం చేశారని ఫైర్ అయిన ముంబై బ్యాటర్

IND vs SA ODI: టీమిండియా యువ ఆటగాడు, మరో సెహ్వాగ్ అని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న  ముంబై బ్యాటర్ పృథ్వీ షా కు భారత సీనియర్ సెలక్షన్ కమిటీ మరోసారి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా అతడిని ఎంపిక చేయలేదు. 

2 Min read
Author : Srinivas M
Published : Oct 05 2022, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న ముంబైకర్ పృథ్వీ షా  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్దలు, నేషనల్ సెలక్షన్ కమిటీ పై గుర్రుగా ఉన్నాడా..? అంటే  అవుననే సమాధానం వినిపిస్తున్నది.  వాళ్ల పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం వారినే లక్ష్యంగా చేసుకుని  పోస్టు పెట్టాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దక్షిణాఫ్రికాతో  వన్డే సిరీస్ ఆడేందుకు గాను  జాతీయ సెలక్టర్లు.. రెండ్రోజుల క్రితమే 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్  వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ జట్టులో  పృథ్వీ షా పేరు తప్పకుండా ఉంటుందని భావించినా సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. 

37

ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షా స్పందిస్తూ.. ‘వాళ్ల మాటలను అస్సలు నమ్మొద్దు. వారి చర్యలను మాత్రమే నమ్మండి. ఎందుకంటే  వాళ్లు మాట్లాడే మాటలు అర్థరహితమైనవని వారి చర్యలు నిరూపిస్తాయి..’ అని ఉన్న కొటేషన్ ను షేర్ చేశాడు. 

47

ఇందులో  షా  ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ పోస్ట్ పెట్టాడనే విషయం  స్పష్టంగా  చెప్పనప్పటికీ  సోషల్ మీడియాలో మాత్రం అతడు బీసీసీఐ, సెలక్టర్లను లక్ష్యంగా చేసుకున్నాడని కామెంట్స్ వెళ్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ తో పాటు దేశవాళీలో కూడా షా రాణిస్తున్నాడు.  

57

ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలో రెండు  మ్యాచ్ లలో కలిపి  105 సగటుతో 315 పరుగులు చేశాడు. అంతకుముందు రంజీ సీజన్ లో కూడా రాణించాడు. ఇంత చేసినా సెలక్టర్లు అతడిని  ఇటీవల న్యూజిలాండ్ ఏ సిరీస్ తో పాటు తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా ఎంపిక చేయలేదు.   

67

అయితే దేశవాళీలో రాణిస్తే జాతీయ జట్టులోకి షాను ఎంపిక చేస్తారని అతడికి సెలక్టర్లలో ఎవరైనా హామీ  ఇచ్చి  తర్వాత మాట తప్పడంతోనే  షా ఇలా ఆగ్రహంగా ఉన్నాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

77

షా ఇలా క్రిప్టిక్ పోస్టులు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత  దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లో అతడిని ఎంపిక చేయకపోవడంపై  స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి’ అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు.

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved