కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించిన లారీ: ఒకరి మృతి
కర్నూలు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్ సమీపంలోని ఐటీసీ కంపెనీ వద్ద వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్ సమీపంలోని ఐటీసీ కంపెనీ వద్ద వేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also read:సంతకాలు చేయమంటే చేశాను.. పెత్తనమంతా శ్రీధర్దే: రాయపాటి సాంబశివరావు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరు చాలా భయానకంగా ఉందని.. స్థానికులు చెబుతున్నారు.
వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో అది మరోక ఆటోను, రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. వెంటనే స్పందించిన స్ధానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మరణించారు.
Also Read:వైఎస్ జగన్ కు చిరాకు: ఎల్వీ ఉదంతంతో సినిమా
కృష్ణానగర్ ఐటీసీ జంక్షన్ వద్ద నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పలుమార్లు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం శూన్యం. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించినట్లుగా తెలుస్తోంది.