ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 4,198 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 9,317 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 21,94,359కి చేరింది.