Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కోవిడ్ తగ్గుముఖం.. 24 గంటల్లో 425 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో 425 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నుంచి 1486 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 19,769 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు.

425 new corona cases reported in andhra pradesh
Author
Amaravati, First Published Feb 19, 2022, 7:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 425 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,15,950కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,710కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 1486 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,93,882కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 19,769 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,29,58,399కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 7,358 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 20, చిత్తూరు 24, తూర్పుగోదావరి 72, గుంటూరు 34, కడప 12, కృష్ణ 55, కర్నూలు 1, నెల్లూరు 11, ప్రకాశం 34, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 36, విజయనగరం 12, పశ్చిమ గోదావరిలలో 113 చొప్పున వైరస్ బారినపడ్డారు.

ఇదిలావుండ‌గా, క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అధికార యంత్రాంగం ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రెండు కోట్ల మంది టీనేజ‌ర్ల‌కు (15-18 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న‌వారికి) రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. 15-18 మ‌ధ్య సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

యువ భారతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్తున్న‌ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ వెల్ల‌డించారు. టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్‌ టీకాలు తీసుకుంటున్నారని అన్నారు. కాగా,  15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి రిజిస్ట్రేష‌న్‌కు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. దీనిలో భాగంగానే రెండు కోట్ల మంది టీనేజ‌ర్ల‌కు రెండు డోసుల టీకాలు అందించారు. అలాగే, క‌రోనా థ‌ర్డ్ వేను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోసులు సైతం అందించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 175.0 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.7 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 75.1 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,68,51,787 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే 12,54,893 కోవిడ్‌-19 (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. అయితే, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనావైర‌స్ ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నాయి.

ఇకపోతే.. దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 22,279 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం త‌గ్గింది. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 4,28,02,505 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 325 మంది కోవిడ్‌-19 తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 5,11,230కి పెరిగింది. ఇదే స‌మ‌యంలో క‌రోనా నుంచి 60298 మంది కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా 2,53,739 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.8 శాతంగా ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios