Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో అదుపులోనే కరోనా.. 24 గంటల్లో 253 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో 253 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 635 మంది కోలుకున్నారు

253 new corona cases reported in ap
Author
amaravathi, First Published Feb 23, 2022, 6:59 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 253 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,16,964కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,718కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 635 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,97,065కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 19,432 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,30,30,124కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 5,181 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 27, చిత్తూరు 27 తూర్పుగోదావరి 39, గుంటూరు 40, కడప 10, కృష్ణ 20, కర్నూలు 4, నెల్లూరు 8, ప్రకాశం 16, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 22, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 37 చొప్పున వైరస్ బారినపడ్డారు.

కాగా.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 5,909,534 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 42.6 కోట్ల మంది దీని బారిన‌ప‌డ్డారు. ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ పంజా విసిరిన దేశాల్లో క‌రోనా కొత్త కేసులు త‌గ్గుముఖం పట్టాయి. అయితే, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు చెందిన స‌బ్ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్న‌ద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స‌బ్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్న‌ద‌ని చెబుతున్నారు. 

క‌రోనా వైర‌స్ గ‌ణాంకాల‌ను న‌మోదుచేసే వ‌ర‌ల్డో మీట‌ర్ కోవిడ్‌-19 డాష్‌బోర్డు వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 426,470,427 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. కోవిడ్-19తో పోరాడుతూ 5,909,534 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 353,637,928 మంది కోలుకున్నారు. అయితే, కోలుకున్న వారు సైతం మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డ‌టం, ప‌లువురిలో కోవిడ్ ల‌క్ష‌ణ‌లు అలాగే కొన‌సాగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, జ‌ర్మ‌నీ, ట‌ర్కీ, ఇట‌లీ, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇరాన్ లు టాప్ లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు స‌గం టాప్‌-5లో ఉన్న దేశాల్లోనే న‌మోద‌య్యాయి. అగ్ర‌రాజ్యం అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,145,282 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అలాగే, 960,157 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా త‌ర్వాత క‌రోనా వైర‌స్ కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రెండో దేశం భార‌త్‌. 

ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,28,51,929 కోవిడ్‌-19 కేసులు, 5,12,344 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ప్ర‌పంచంలో కోవిడ్‌-19 కార‌ణంగా ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మైన మూడో దేశం బ్రెజిల్‌. ఇప్ప‌టికీ అక్క‌డ క‌రోనా ప్ర‌భావం అధికంగానే ఉంది. బ్రెజిల్ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,250,591 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 644,695 మంది చ‌నిపోయారు. ఇక ఫ్రాన్స్ లో 22,304,024 మందికి క‌రోనా సోక‌గా, 132,662 మంది మ‌ర‌ణించారు. బ్రిట‌న్ లోనూ క‌రోనా మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించాయి. బ్రిట‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18,654,572 కేసులు, 160,610 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ర‌ష్యాలోనూ క‌రోనాతో 346,235 మంది చ‌నిపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios