Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే..?

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,891 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ కారణంగా అనంతపురం జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కరోనా నుంచి 10,241 మంది కోలుకున్నారు. 

1891 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Feb 8, 2022, 6:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,891 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,06,943కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల అనంతపురం జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,667కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 10,241 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,38,226కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 26,236 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,27,05,524కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 54,040 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 90, చిత్తూరు 91, తూర్పుగోదావరి 440, గుంటూరు 222, కడప 58, కృష్ణ 356, కర్నూలు 67, నెల్లూరు 70, ప్రకాశం 141, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 121, విజయనగరం 28, పశ్చిమ గోదావరిలలో 186 చొప్పున వైరస్ బారినపడ్డారు.

ఇదిలావుండ‌గా, దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు (Coronavirus) న‌మోద‌వుతున్నాయి. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్‌-19 కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కొత్తగా రోజువారీ కేసులు లక్ష దిగువ‌ర‌కు ప‌డిపోయాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 67,597 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,23,39,611 కు చేరింది. Coronavirus యాక్టివ్ కేసులు సైతం ప‌దిల‌క్ష‌ల దిగువ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైరస్ నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా  (Coronavirus)రిక‌వ‌రీల సంఖ్య 4,08,40,658 కి పెరిగింది. 

దేశంలో కోవిడ్ కేసులు  (Coronavirus) త‌గ్గుతున్న‌ప్ప‌టికీ మ‌ర‌ణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో  క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా కార‌ణంగా భార‌త్ లో చ‌నిపోయిన వారి సంఖ్య 5,04,062ల‌కు చేరుకుంది. కోవిడ్మ‌-19 మ‌ర‌ణాలు రేటు 1.19 శాతంగా ఉంది. రిక‌వ‌రీ రేటు 96.2 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 9.1 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా (Coronavirus) కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 170.2 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.1 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.8 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం74,15,61,587 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. సోమ‌వారం ఒక్క‌రోజే 11,56,363 కోవిడ్‌-19  (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios