Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ తీవ్రత: కొత్తగా 11,573 కేసులు, కడపలో అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,573 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,60,181కి చేరుకుంది.

11573 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Jan 29, 2022, 7:45 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,573 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,60,181కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,594కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 9,445 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,30,162కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 40,357 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,06,132కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,54,425 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 926, చిత్తూరు 479, తూర్పుగోదావరి 951, గుంటూరు 1298, కడప 1942, కృష్ణ 969, కర్నూలు 1522, నెల్లూరు 706, ప్రకాశం 655, శ్రీకాకుళం 274, విశాఖపట్నం 1024, విజయనగరం 247, పశ్చిమ గోదావరిలలో 580 చొప్పున వైరస్ బారినపడ్డారు.

కాగా.. భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గుతుంది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు (Covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. తాజాగా కరోనాతో 871 మంది మృతిచెందారు. అయితే తాజాగా మరణాల్లో గత 24 గంటల్లో 613 మంది మృతిచెందగా.. కేరళ ప్రభుత్వం 258 బ్యాక్ లాగ్ మరణాలు నమోదు చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,93,198కి పెరిగింది. 

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,35,939 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,83,60,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333గా ఉంది. ఇక, తాజా నమోదైన కొత్త కేసులలో.. కేరళలో అత్యధికంగా కేరళలో  54,537, కర్ణాటకలో 31,198, తమిళనాడులో 26,533, మహారాష్ట్రలో 24,948, ఆంధ్రప్రదేశ్‌లో 12,561  కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో దాదాపు 63.59 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. కేవలం కేరళలోనే 23.15 శాతం కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 13.39 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.89 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.89 శాతంగా, యాక్టివ్ కేసులు.. 4.91 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉంది. ఇక, దేశంలో శుక్రవారం (జనవరి 28) రోజున 17,59,434 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 72,57,74,705 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios