మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయాలు అడిగారని... తాను నాలుగు కోట్లు అప్పులు చేశానని మిగిలిన విషయాలు తర్వాత చెబుతానని తనకు ఫోన్లో చెప్పారని శిఖా చౌదరి చెప్పారు.
హైదరాబాద్: మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయాలు అడిగారని... తాను నాలుగు కోట్లు అప్పులు చేశానని మిగిలిన విషయాలు తర్వాత చెబుతానని తనకు ఫోన్లో చెప్పారని శిఖా చౌదరి చెప్పారు. ఎప్పుడూ కూడ వాట్సాప్ కాల్లోనే మామయ్య తనతో మాట్లాడేవారని, కానీ, డబ్బులు అడిగిన రోజు మాత్రం ఇండియన్ నెంబర్ నుండి ఫోన్ చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి చెప్పారు. ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
మామయ్య ఇంట్లో నుండి తాను ఎలాంటి డాక్యుమెంట్లను తీసుకెళ్లలేదని ఆమె చెప్పారు. జయరామ్ ఇంటికి చాలా మంది వచ్చి వెళ్తుంటారని ఆమె చెప్పారు. జయరామ్ వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదన్నారు.
కంపెనీ వ్యవహరాల గురించే తాము మాట్లాడుకొనే వాళ్లమని ఆమె చెప్పారు. తాను ఒక ప్రాజెక్టును చేస్తున్నానని ఈ ప్రాజెక్టుతో జయరామ్కు కూడ సంబంధం లేదని ఆమె చెప్పారు.
జయరామ్ ఎప్పుడూ కూడ తనతో వాట్సాప్ కాల్లో మాట్లాడేవారని ఆమె చెప్పారు. అలాంటిది ఒక్క రోజు తనకు ఇండియన్ నెంబర్ నుండి ఫోన్ చేసినట్టు ఆమె చెప్పారు. అర్జంట్గా తనకు కోటి రూపాయాలు కావాలని అడగడంతో షాక్ అయ్యాయని ఆమె చెప్పారు. తాను రూ. 4 కోట్లు అప్పులు చేశానని ఈ డబ్బులు తిరిగి చెల్లించాలని అప్పు ఇచ్చినవారంతా ఒత్తిడి చేస్తున్నారని తనకు ఫోన్లో చెప్పారన్నారు.
అన్ని విషయాలను తాను తర్వాత చెబుతానని మామయ్య ఫోన్లో చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఇంతలోనే మామయ్య హత్య జరిగిందని ఆమె తెలిపారు.జయరామ్ హత్య కుట్రలో శిఖా చౌదరి పాత్ర ఉంటుందనే అనుమానాన్ని ఆయన భార్య పద్మశ్రీ వ్యక్తం చేస్తున్నారు.
శిఖా పాత్ర లేకుంగా జయరామ్ హత్య జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. జయరామ్ హత్య తర్వాత తన ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు కన్పించకుండా పోయాయని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంబంధిత వార్తలు
ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ
అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య
భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన
శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య
ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
జయరామ్ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్
జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే
19 గంటలు నిర్భంధం: జయరామ్కు రాకేష్ చిత్రహింసలు
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య
జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్
జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...
జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్
జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి
రాకేష్ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?