కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

By narsimha lodeFirst Published Sep 28, 2018, 2:29 PM IST
Highlights

మద్యం మత్తులో కూతురిపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా మద్యం తాగేందుకు  డబ్బుల కోసం  వ్యభిచారం చేయాలని భార్యపై  వత్తిడి  చేస్తున్న భర్తను భార్యే  హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగరి జిల్లాలో చోటు చేసుకొంది.

భువనగిరి: మద్యం మత్తులో కూతురిపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా మద్యం తాగేందుకు  డబ్బుల కోసం  వ్యభిచారం చేయాలని భార్యపై  వత్తిడి  చేస్తున్న భర్తను భార్యే  హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగరి జిల్లాలో చోటు చేసుకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన ముద్దంగుల యాదగిరిని అతని భార్య మంగ గొంతు పిలసికి చంపేసింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌లో జూలై 18వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే  భర్తను హత్య చేసిన భార్య మంగ.... పోలీసులకు మాత్రం తప్పుడు ఫిర్యాదు ఇచ్చింది. తన భర్తను ఎవరో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు  హత్య చేశారని  ఫిర్యాదు చేసింది.

అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి విచారణ జరిపారు.ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

యాదాద్రి భువనగరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన  ఎం. యాదగిరి, ఆయన భార్య మంగ కూలీ పని చేసి జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు ఆడ, ముగ్గురు మగ పిల్లలు. అయితే  ఏడాది క్రితం వరకు హైద్రాబాద్‌ జవహార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌ ప్రాంతంలో కూలీపనిచేసుకొంటూ కుటుంబాన్ని పోషించేవాడు.

యాదగిరి మద్యానికి బానిసగా మారాడు. మద్యం కొనుగోలు కోసం  భార్యను వేధించేవాడు. డబ్బులు సంపాదించేందుకు  భార్యను వ్యభిచారం చేయాలని  యాదగిరి భర్తను వేధించేవాడు. అంతేకాదు ఒకరోజు  మద్యం మత్తులో  కూతురిపై  అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో యాదగిరిపై జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడ నమోదైంది.

దీంతో ఉపాధి కోసం  మంగ తన పిల్లలతో కలిసి బీబీనగర్ ప్రాంతానికి వచ్చింది. బీబీనగర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉంటున్నారు. జైలు నుండి వచ్చిన యాదగిరి 2018 జూలై 18వ తేదీన  మద్యం మత్తులో  డబ్బుల కోసం భార్యను  వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. 

దీంతో కోపంతో మంగ భర్త యాదగిరిని కిందకు తోసేసింది.  కిందపడిన భర్త యాదగిరి  గొంతు పిసికి చంపేసింది.. ఆ తర్వాత కట్టుకథ అల్లిందని పోలీసులు తెలిపారు. బుధవారం నాడు మంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు. 

సంబంధిత వార్తలు

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

click me!