Asianet News TeluguAsianet News Telugu

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

వరుసకు కొడుకైన యువకుడితో నే వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్న ఓ వివాహిత... కొడుకు పుట్టిన రోజునే ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది. అంతేకాదు తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

pinki kills husband with the help of lover in harnaya
Author
Haryana, First Published Aug 18, 2018, 3:50 PM IST


రోహ్‌తక్: వరుసకు కొడుకైన యువకుడితో నే వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్న ఓ వివాహిత... కొడుకు పుట్టిన రోజునే ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసింది. అంతేకాదు తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే  ఈ విషయమై  బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో  అసలు విషయం తెలిసి  మృతుడి బంధువులు షాక్‌కు గురయ్యారు.ఈ ఘటన హార్యానా రాష్ట్రంలోని జింద్ గ్రామంలో చోటు చేసుకొంది. 

హార్యానా రాష్ట్రంలోని  జింద్ గ్రామానికి చెందిన జోగిందర్ సింగ్  కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య  పింకీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.జోగిందర్‌కు సోనెపట్ పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరకడంతో  భార్య, పిల్లలతో కలిసి సోనెపట్ పట్టణంలోని భార్య సోదరి ఇంటికి మారాడు.

అయితే  ఈ క్రమంలోనే  భార్య సోదరి కుమారుడైన  రవితో పింకీకి వివాహేతర సంబంధం ఏర్పడింది.  ఓ రోజు ఫ్యాక్టరీ నుండి  ఇంటికి వచ్చిన జోగిందర్‌సింగ్‌ షాక్ కు గురయ్యాడు.  తన సోదరి కొడుకు రవితో  తన భార్య పింకీ రాసలీలల్లో మునిగితేలుతోంది. ఈ విషయాన్ని గమనించిన జోగిందర్ సింగ్  భార్య పింకిపై మండిపడ్డాడు.

సోనెపట్‌లో ఫ్యాక్టరీ ఉద్యోగం మానేసి  భార్య, పిల్లలను తీసుకొని జోగిందర్ సింగ్  తన స్వంత గ్రామానికి వచ్చేశాడు.  అయితే సోనెపట్ వెళ్లాలని లేకపోతే విడాకులు ఇస్తానని భార్య పింకీ  భర్త జోగిందర్ సింగ్ ను బెదిరించింది.  జోగిందర్ కుమారుడు  అమరజిత్ పుట్టిన రోజను పురస్కరించుకొని విందును ఏర్పాటు చేశాడు.  ఈ విందుకు  జోగిందర్ సింగ్ భార్య పింకీ ప్రియుడు రవి కూడ వచ్చాడు.  

జన్మదినవేడుకలు ముగిసిన తర్వాత  జోగిందర్‌ను  ప్రియుడు రవితో కలిసి  భార్య పింకీ హత్య చేసింది.అయితే  ఏమీ తెలియనట్టుగానే జోగిందర్ సింగ్ ను ఎవరో చంపేశారని  ఆమె  మామకు చెప్పింది. జోగిందర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో  రవితో కలిసి  జోగిందర్ సింగ్ ను తానే హత్య చేసినట్టు  పింకీ ఒప్పుకొంది. పింకీ, రవిలపై  కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ వార్లలు చదవండి

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్

వివాహేతర సంబంధం: ప్రశ్నించిన భర్తకు షాకిచ్చిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

76 ఏళ్ల వయస్సులో చిన్నారులపై లైంగిక వేధింపులు: రాత్రి గదిలో ఇలా...

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios