ఏడాదిగా మహిళా కానిస్టేబుల్పై హెడ్కానిస్టేబుల్తో పాటు సోదరుడి అత్యాచారం
సమాజంలో పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తాను పనిచేసే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్పై ఏడాదికిపైగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఛండీఘడ్: సమాజంలో పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తాను పనిచేసే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్పై ఏడాదికిపైగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తనతో పాటు తన సోదరుడితో కూడ బాధితురాలిపై అత్యాచారం చేయించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ పై అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
పల్వాల్ మహిళా పోలీస్ స్టేషన్ లోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్పీ వసీం అక్రం తెలిపారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న
జోగీందర్ అలియాస్ మింటూతో పల్వాల్ జిల్లా అల్వార్పూర్లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు చెబుతున్నారు.
ఫరీదాబాద్, జింద్, పల్వాల్లో పనిచేస్తుండగా జోగీందర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుఆమె ఆరోపించారు. 2017 జూన్లో నిందితుడు తన సోదరుడిని పరిచయం చేయగా అతడు కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు.
తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ జోగీందర్ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు డబ్బు కోసం వేధించాడని ఆరోపించారు. కాగా విచారణలో నిందితుడు జోగీందర్కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలు కూడా వివాహితని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు చదవండి
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్