పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...
పెళ్లైన తర్వాత కూడ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ జంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రియుడి చేతిని నరికేశారు.
బెంగుళూరు: పెళ్లైన తర్వాత కూడ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ జంటపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రియుడి చేతిని నరికేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు. చిత్రదుర్గకు చెందిన 25 ఏళ్ల యువతికి అదే జిల్లాకు చెందిన యువకుడితో నెల క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే ఆ యువతికి తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా మిడిగేశి రవీష్ తో ప్రేమ వ్యవహారం ఉంది.
రవీష్ బెంగుళూరులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అనేకల్లోని యారండహళ్లిలో ఇల్లును అద్దెకు తీసుకొని రవీష్ ఉంటున్నాడు. అయితే రవీష్ తో ప్రేమలో ఉన్న ఆ యువతి ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఇంట్లో నుండి పారిపోయి రవీష్ వద్దకు చేరుకొంది.
మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రవీశ్, ఆ యువతితో కలిసి బన్నేరుఘట్టలో ఉన్న చంపకధామ దేవాలయం వెనుకనున్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. బన్నేరుఘట్ట అటవీప్రదేశంలో ఏకాంతంగా ఉండగా కొందరు దుండగులు మారణాయుధాలతో యువకుడిపై దాడి చేశారు. కుడిచేతి మణికట్టు వరకు నరికివేసి చేతిని తమ వెంట తీసుకెళ్లారు.
గాయపడిన ప్రియుడిని ప్రియురాలు స్థానికుల సహాయంతో బన్నేరుఘట్ట ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈఘటనపై బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు చదవండి
భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...
ఏడాదిగా మహిళా కానిస్టేబుల్పై హెడ్కానిస్టేబుల్తో పాటు సోదరుడి అత్యాచారం
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే..
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య