సూడాన్లో పౌర యుద్ధం కారణంగా 300 మందికి పైగా మృతి చెందారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంపై ట్రంప్ స్పందించారు. రష్యా కావాలని దాడి చేయలేదని ట్రంప్ అన్నారు. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో బెంగాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ముంబై దాడుల ఉగ్రవాది తహవ్వూరు రాణా విచారణ కొనసాగుతోంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

11:45 PM (IST) Apr 15
ట్రంప్ ప్రభుత్వం డిమాండ్లకు హార్వర్డ్ తలొగ్గకపోవడంతో 2.3 బిలియన్ ఫెడరల్ నిధులను స్తంభింపజేసింది.
పూర్తి కథనం చదవండి11:42 PM (IST) Apr 15
Putin PA Dmitry Peskov: పెళ్లికి ముందు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం, సర్ప్రైజులు ఇవ్వడం అబ్బాయిలు కామన్గా చేసేదే. ఇక పెళ్లి తర్వాత భార్య ఇచ్చే సర్ప్రైజుల వల్లనో లేదా మరే ఇతర కారణాలో మగాళ్లు భార్యలను ఇంప్రెస్ చేయడం పనిగా పెట్టుకోరు. ఇక చాలా మంది మగాళ్లకి అసలు పెళ్లి రోజు డేట్ ఎప్పుడో గుర్తుంచుకోరు.. మరీ ముఖ్యంగా భార్య పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోని వారు అనేకమంది. అదేమంటే పని ఒత్తిడి వల్ల, ఆఫీస్ పనుల వల్ల మర్చిపోయానని భర్తలు చెబుతుంటారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పీఏ మాత్రం తన భార్య బర్త్డేను గుర్తుంచుకుని వెరైటీగా విషెస్ చెప్పాడు. అదీ కూడా ఓ ఆటతో.. సర్ప్రైజ్ చేసి ఆటగాడు అనిపించుకున్నాడు.
11:40 PM (IST) Apr 15
IPL 2025 PBKS vs KKR: ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్ను పంజాబ్ కింగ్స్ ఓడించడంలో యుజ్వేంద్ర చాహల్ రియల్ హీరోగా నిలిచాడు. ఐపీఎల్లో తన రెండో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ టీమ్ 111 పరుగులను డిఫెండింగ్ చేసుకోగలిగింది.
11:31 PM (IST) Apr 15
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య బోయింగ్ విమానాల డెలివరీ నిలిచిపోయింది. దీంతో ఏవియేషన్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
పూర్తి కథనం చదవండి11:09 PM (IST) Apr 15
పారిశుద్ద్య కార్మికుల భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 100 రోబోలను కొనుగోలు చేయనుంది. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యాన్ హోల్స్ ను శుభ్రపరిచేందుకు ఈ రోబోలను ఉపయోగించనున్నారు
పూర్తి కథనం చదవండి10:37 PM (IST) Apr 15
IPL 2025: పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయ్యాడు. ఎందుకు?
పూర్తి కథనం చదవండి10:15 PM (IST) Apr 15
ప్రస్తుతం ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు పైపైకి వెళుతున్నాయి. ఈ క్రమంలో బయట తిరిగేవారు వడదెబ్బల బారినపడే ప్రమాదముంది. దీంతో వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది తెలంగాణ సర్కార్. కాబట్టి ఇకపై ఎండల కారణంగా చనిపోయినా ఎక్స్ గ్రేషియా ఇస్తారు... ఎంతో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:07 PM (IST) Apr 15
సారా అలీ ఖాన్ తన అమ్మ అమృత సింగ్, తమ్ముడు ఇబ్రహీంతో స్విస్ ఆల్ప్స్కి వెళ్ళింది. అక్కడి పిక్చర్స్ షేర్ చేసింది. మంచులో అడ్వెంచర్స్, ఫ్యామిలీతో సరదాగా గడిపిన మూమెంట్స్ అన్నీ చూస్తే ఎవరికైనా ట్రిప్ వెళ్లాలనిపిస్తుంది.
పూర్తి కథనం చదవండి09:57 PM (IST) Apr 15
Gadget: సామాన్యులకు మంచి ఫీచర్లు, సరసమైన ధరల్లో ల్యాప్టాప్లను లెనెవో సంస్థ అందిస్తోంది. తాజాగా లెనెవో లాస్ వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో రోల్ చేసే ల్యాప్టాప్ డిస్ప్లేను లెనెవో కంపెనీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ థింక్బుక్ ల్యాప్టాప్ ప్రత్యేకత ఏంటంటే..
09:34 PM (IST) Apr 15
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఘాటుగా స్పందించారు. వెంటనే ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మౌనం వీడాలని ఆయన సూచించారు.
పూర్తి కథనం చదవండి
09:31 PM (IST) Apr 15
National Herald Case ED Chargesheet: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ తొలిసారి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాబర్ట్ వాద్రాను కూడా విచారించారు, కాంగ్రెస్ దీన్ని 'రాజకీయ కుట్ర' అని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మరో వివాదంగా మారింది.
పూర్తి కథనం చదవండి09:21 PM (IST) Apr 15
మన దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో కూడా సమాన హక్కులను చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. కానీ పోలీసుశాఖలో ఉన్నత ర్యాంకుల్లో పనిచేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోందని సర్వే చెబుతోంది. దీంతోపాటు న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం ఇలా మొత్తం నాలుగు రంగాల్లో మహిళా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను ఇటీవల ఓ సంస్థ సేకరించింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
08:34 PM (IST) Apr 15
Mamaearth's co-founder Ghazal Alagh: 21 ఏళ్లకే బాసు.. అప్పుడే తల్లి అయిన మామా ఎర్త్ కో-ఫౌండర్ గజల్ అలాఘ్ కు తన వ్యక్తిగత జీవితం, ఆఫీసు లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫిక్స్ అయిన టైమింగ్ లేకపోవడం, ప్రొఫెషనల్ అనుభవం తక్కువగా ఉండడం వంటి అంశాలతో ఎదురుదెబ్బలు తప్పలేదు. వద్దని పోయిన వారిని తనవద్దకు వచ్చేలా కొత్తగా నేర్చుకుంటూ ఎదిగారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
07:56 PM (IST) Apr 15
కేంద్ర ప్రభుత్వంతో తమిళనాడు వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లు, డీలిమిటేషన్ వంటి చాలా విషయాల్లో కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న స్టాలిన్ సర్కార్ తాజాగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి హక్కులను కాపాడుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి07:44 PM (IST) Apr 15
iPhone: మనకి తెలిసి అత్యంత ఖరీదైన ఫోన్ ఏదంటే.. ఐఫోన్ అని ఠక్కున చెప్పేస్తాం కదా.. కాని ఐఫోన్ రాక ముందు అంత ఖరీదైన ఫోన్ ఒకటి ఉండేది. దాని ధర అప్పట్లోనే ఎంత ఉండేదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి
06:56 PM (IST) Apr 15
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో దెబ్బతిన్న భారతీయ స్టాక్ మార్కెట్స్ మూడు రోజుల వరుస సెలవుల తర్వాత మళ్లీ జోరందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ టాప్లో ఉంది.
పూర్తి కథనం చదవండి06:47 PM (IST) Apr 15
Waqf Board Claims Entire Tamil Nadu’s village: వక్ఫ్ బోర్డు తమిళనాడులోని ఒక గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి, అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలకు ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది.
పూర్తి కథనం చదవండి06:09 PM (IST) Apr 15
'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో తన అనుమతి లేకుండా తన 3 పాటలు వాడినందుకు ఇళయరాజా మైత్రి మూవీ మేకర్స్కు నష్టపరిహారం కోరుతూ నోటీసు పంపడం హాట్ టాపిక్గా మారింది.
06:02 PM (IST) Apr 15
దేశంలో డిజిటల్ లావాదేవీలు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జేబుల్లో డబ్బులు పెట్టుకునే వారి సంఖ్య తగ్గుతోంది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఇలా రకరకాల మొబైల్ వ్యాలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే యూపీఐ సేవలను మరింత ప్రోత్సహించే క్రమంలో యాప్స్కు క్రెడిట్ కార్డును లింక్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు.
05:59 PM (IST) Apr 15
అయోధ్యలోని రామాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఆలయ ట్రస్ట్ భద్రత పెంచాలంటూ అధికారులను కోరారు. ఇటీవలే రామనవమి వేడుకలు అట్టహాసంగా ముగియగా ఇప్పుడిలా బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
పూర్తి కథనం చదవండి05:51 PM (IST) Apr 15
ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.ఎస్. స్టాన్లీ కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
05:39 PM (IST) Apr 15
Amarnath Yatra: భారీ పర్వతాలపై అత్యంత ఎత్తులో మంచు లింగంగా కొలువైన అమరనాథుడిని దర్శించాలని కోరుకుంటున్నారా? ఇది సాధారణ ప్రజలకు సాహసోపేతమైన ప్రయాణమే. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అమర్నాథ్ యాత్ర - 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. యాత్ర కోసం మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:29 PM (IST) Apr 15
Google layoffs 2025: గూగుల్ గ్లోబల్ లేఅఫ్స్ నేపథ్యంలో భారత్లోని ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగాలపై కూడా ప్రభావం పడనుంది. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రకటన, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఊడుతాయని సమాచారం. 2025 జనవరిలో వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ తర్వాత గూగుల్ లో కొనసాగుతున్న రీస్ట్రక్చరింగ్ ఇది.
05:07 PM (IST) Apr 15
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎవరు వైరల్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఇలా గత కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండ్ అవుతోన్న వారిలో లేడీ అఘోరి ఒకరు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేమైన అఘోరీ శ్రీనివాస్ ఎంత రచ్చ చేయాలో అంత చేసింది. నగ్నంగా కనిపిస్తూ, అందరినీ షాక్కి గురి చేసింది. ఈ క్రమంలోనే అఘోరీ చేసిన ఓ పని అందరినీ షాక్కి గురి చేస్తోంది.
04:59 PM (IST) Apr 15
Delhi Airport : దేశ రాజధాని డిల్లీకి వివిధ రాష్ట్రాల నుండి రాజకీయ ప్రముఖులే కాదు ఇతరులు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో ఎక్కువమంది విమానాల్లోనే వెళుతుంటాయి. అయితే డిల్లీ విమానాశ్రయంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. అవేంటో తెలుగుసుకుంటే ప్రయాణం సాఫీగా సాగించవచ్చు.
పూర్తి కథనం చదవండి04:50 PM (IST) Apr 15
Sabarimala Ayyappa: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి అయ్యప్ప బొమ్మతో బంగారు లాకెట్ల అమ్మకం, పంపిణీ ప్రారంభమైంది. మీకు ఈ లాకెట్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే చాలు. కొనుగోలు ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి
03:38 PM (IST) Apr 15
Kochi Water Metro: కేరళలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పర్యటకులు వస్తుంటారు. కేరళలోని నదులు, ఇళ్ల నిర్మాణాలు, ప్రజల జీవనవిధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈక్రమంలో టూరిజాన్ని మరింత అభివృద్ది చేసి పర్యాటలకు ఆకర్షించే లక్ష్యంతో కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ కొత్త సర్వీసులను తీసుకొస్తోంది. ఇప్పటికే మెట్రో పడవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఈ మార్గాల్లో కొత్త సర్వీసులను ప్రారంభించున్నారు.
పూర్తి కథనం చదవండి03:30 PM (IST) Apr 15
యూఏఈలో భారత్ మార్ట్ పేరుతో పెద్ద మాల్ ఓపెన్ కానుంది. ఇది 2026లో మొదలవుతుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్లో ఉన్న భారత్ మార్ట్ 27 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఉంటది. ఇక్కడ దుకాణాలు, షోరూమ్లు, గిడ్డంగిలు ఉంటాయి. దీనివల్ల భారతదేశంలో తయారైన వస్తువులను ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, యూరేషియాకు చేరవేయడానికి సహాయపడుతుంది.
02:56 PM (IST) Apr 15
ఓ మూగజీవిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చత్తీస్ ఘడ్ జిల్లాలో జరిగిన జంతుహింస ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి కథనం చదవండి02:42 PM (IST) Apr 15
చెట్టు కల్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే కృత్రిమ కల్లు మాత్రం ప్రాణాలకే ప్రమాదమని మీకు తెలుసా.? చెట్టు కల్లు లభ్యత తగ్గిపోవడం, తక్కువ ధరకే సీసాలో కళ్లు లభిస్తుండంతో చాలా మంది వాటికి అలవాటుగా మారుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్లు లేకుండా రోజు గడవని వారు చాలా మంది. అయితే ఈ కల్లులో కలిపే పదార్థాల గురించి తెలిస్తే జీవితంలో ఇకపై దాని జోలికి వెళ్లరు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
02:29 PM (IST) Apr 15
నటుడు అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా ఏప్రిల్ 10న విడుదలై థియేటర్లలో దుమ్మురేపుతోంది. అజిత్ వాట్సాప్ డీపీ గురించి నటి ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడారు.
01:17 PM (IST) Apr 15
Prices Hike: సిలికాన్ వ్యాలీ సిటీగా పేరుగాంచిన బెంగళూరు అభివృద్దిపథంలో దూసుకెళ్తోంది. అయితే.. మరోవైపు నగరంలోని ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కాలంలో నంది పాల నుంచి మెట్రో రైల్ ఛార్జీల వరకు అన్ని రేట్లు భారీగా పెరిగాయి. దీంతో ఇక సామాన్యులు, ఓ స్థాయి ఉద్యోగాలు చేసుకునేవారు కూడా అక్కడ బతకడం రానురాను కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు వల్లే కర్నాటక ప్రభుత్వం ఇలా ధరలు పెంచుతుందా లేదా మరేమైన కారణాలు ఉన్నాయా.. అసలు ధరలు ఏ మేర పెంచారు అన్న విషయం ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి01:01 PM (IST) Apr 15
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ భర్త, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హరియాణాలో జరిగిన భూ లావాదేవీకి సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈ విచారణకు ఆయన తన నివాసం నుంచి నడుచుకుంటూ న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:59 PM (IST) Apr 15
Sankat Hara Chaturthi: ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట గణపతిని పూజించాలని అంటారు. అయితే సంకట హర చతుర్థి రోజు పూజిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ రోజు గణపతిని ఏవిధంగా పూజించాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:29 PM (IST) Apr 15
ఆర్థిక మాంద్యం దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా దీవాలా తీయడాన్ని ఆర్థిక పరిభాషలో ఆర్థిక మాంద్యంగా పిలుస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా 'ఫ్రెండ్షిప్ రీసెషన్' గురించి విన్నారా.? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటీ ఫ్రెండ్షిప్ రీసెషన్.? దీనికి అసలు కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
11:47 AM (IST) Apr 15
Health Insurance: ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ చాలా అవసరం. ప్రతి నెలా రూ.వందల్లో ప్రీమియం రూ.లక్షల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఏకంగా రూ.కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీ గురించి, ఆ కంపెనీ, ప్రీమియం తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:36 AM (IST) Apr 15
పాప్ స్టార్ కేటీ పెర్రీ, మరో ఐదుగురు మహిళలు బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. 60 ఏళ్లలో మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి
10:51 AM (IST) Apr 15
Nani HIT-3: నేచురల్ స్టార్ నాని హిట్-3 సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు తీసిన సినిమాలకంటే భిన్నంగా ఇందులో కనిపించబోతున్నాడు. సినిమా క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుందని కనిపిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ను విడుదల చేసింది. ఇందులో నాని క్యారెక్టర్ ఊరమాస్గా ఉంది. యాంగ్రీ కాప్గా నాని కనిపిస్తున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్బంగా మూవీ యూనిట్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇలాంటి వైలెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలో ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు ఎందుకు ఇరికించారు.. అని ఓ విలేకరి ప్రశ్నించారు.. దీనిపై నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పూర్తి కథనం చదవండి10:25 AM (IST) Apr 15
UPSC: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. దేశానికి సేవ అందించే ఈ గొప్ప ఉద్యోగం కోసం చాలా మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. దేశ సేవ మాత్రమే కాకుండా మంచి జీవితం, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందీ యూపీఎస్సీ. ఇందులో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా, కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో అడిగే కొన్ని ప్రశ్నలు వింతగా ఉంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
09:48 AM (IST) Apr 15
వక్ఫ బిల్లు సవరణ అనతరం బెంగాల్ నిరసనలతో అట్టుడుకోంది. ముర్షిదాబాద్ లో అల్లర్లు చెలరేగాయి. అయితే ఈ అలర్ల వెనకాల బంగ్లాదేశ్కు చెందిన 2 ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇదివరకే ఆరోపించారు. తాజాగా అతని వాదనకు పోలీసు యంత్రాంగం సైతం మద్దతు తెలిపింది..
పూర్తి కథనం చదవండి