National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా-రాహుల్ గాంధీలకు షాక్

National Herald Case ED Chargesheet: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ తొలిసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాబర్ట్ వాద్రాను కూడా విచారించారు, కాంగ్రెస్ దీన్ని 'రాజకీయ కుట్ర' అని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మరో వివాదంగా మారింది. 

National Herald Case ED Chargesheet: Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda and more in telugu rma

National Herald Case: గాంధీ కుటుంబంపై ఈడీ మరోసారి ఉచ్చు బిగించడం మొదలు పెట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ ఇచ్చింది. హర్యానా రియల్ ఎస్టేట్ డీల్‌లో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి రాబర్ట్ వాద్రాను విచారించిన కొన్ని గంటలకే, నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడాను నిందితులుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఈ ఛార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణాధికారి, ప్రత్యేక న్యాయవాది కేసు డైరీతో హాజరు కావాలని స్పెషల్ జడ్జి విశాల్ గోగనే ఆదేశించారు.

ఏజేఎల్ ఆస్తులపై రూ. 661 కోట్ల జప్తు నోటీసు

ఛార్జ్‌షీట్ కంటే ముందు శనివారం ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ. 661 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు అంటించింది. ఈ ఆస్తులు ఢిల్లీ, ముంబైలోని బాంద్రా ప్రాంతం, లక్నోలోని ఏజేఎల్ భవనంలో ఉన్నాయి. వీటిలో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ హెరాల్డ్ హౌస్ కూడా ఉంది.

బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపణలు ఏమిటి?

ఈడీ విచారణ 2021లో ప్రారంభమైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 2014లో ఇచ్చిన ఆదేశం దీనికి ఆధారం. బీజేపీ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి వ్యక్తిగత ఫిర్యాదు మేరకు ఈ ఆదేశం జారీ అయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏజేఎల్ కోట్ల రూపాయల ఆస్తులను మోసపూరితంగా సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు.

కాగా, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38-38 శాతం వాటా ఉంది. యంగ్ ఇండియన్ సంస్థే ఏజేఎల్‌కు యజమాని. ఇది నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురిస్తుంది.

కాంగ్రెస్ దాడి: 'ఈడీ మోడీ డైరెక్షన్ ప్రకారమే పనిచేస్తోంది'

కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ, కాంగ్రెస్‌ను అంతం చేయడానికి మోడీజీ చేస్తున్న కుట్ర ఇదంతా అని అన్నారు. ఈడీ బెదిరింపులకు మేము భయపడము. ఈ పోరాటాన్ని రాజకీయంగానే చేస్తామని అన్నారు. 

వాద్రా ఏమన్నారంటే.. మోడీ భయపడితే ఈడీని ముందుకు తెస్తారు

ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి కొన్ని గంటల ముందు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను కూడా హర్యానాలోని ఒక రియల్ ఎస్టేట్ డీల్‌లో మనీలాండరింగ్ గురించి ఈడీ ప్రశ్నించింది. ఏజెన్సీ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా వాద్రా అభివర్ణించారు. నేను ఇదివరకే గంటల తరబడి ప్రశ్నలకు సమాధానం చెప్పాను, ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే అని వాద్రా అన్నారు.

వాద్రా కేసు ఏంటి?

2008లో రాబర్ట్ వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ హర్యానాలో 7.5 కోట్లకు భూమి కొనుగోలు చేసి, అక్కడ హౌసింగ్ సొసైటీ కోసం అనుమతి పొందింది. ఆ తర్వాత అదే భూమిని డీఎల్‌ఎఫ్‌కు 58 కోట్లకు అమ్మేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా  ఉన్నారు. అప్పుడే అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని కాంగ్రెస్ ఖండించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios