మహాత్మా గాంధీ పరిస్థితే కవితకు కూడా... బ్రిటీష్, బిజెపి సేమ్..: వాల్ పోస్టర్ల కలకలం

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ హైదరాబాద్ లో వెలుస్తున్న ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 

First Published Mar 16, 2023, 2:15 PM IST | Last Updated Mar 16, 2023, 2:15 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ హైదరాబాద్ లో వెలుస్తున్న ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ బిజెపిలో చేరగానే అవినీతి నాయకులు కాస్తా నిజాయితీపరులుగా మారారంటూ, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరుకాకుండా బిజెపి నేత బిఎల్ సంతోష్ దాక్కున్నారంటూ కొన్ని పోస్టర్లు వెలిసారు. తాజాగా బ్రిటిష్ వారు స్వాంతంత్య్ర సమరయోధుల నోర్లు మూయించినట్లుగా బిజెపి ప్రభుత్వం కేసీఆర్, కవితతో పాటు మరికొందరు నాయకుల నోర్లు మూయిస్తోందనేలా కొన్ని వాల్ పోస్టర్లు వెలిసారు. మహాత్మా గాంధీ, చంద్రబోస్, భగత్ సింగ్ నాయకుల నోర్లు మూసిన ఫోటోలు పై వరుసలో... కేసీఆర్, కవిత, కేజ్రీవాల్, నితీశ్, స్టాలిన్ ల నోరు మూసినట్లుగా కింది వరుసలో ఫోటోలతో గోడలకు పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కవిత ఈడి విచారణ వేళ ఈ పోస్టర్లు వెలియడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.