Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్లలో కేటీఆర్ కు నిరసన సెగ... కాన్వాయ్ ని అడ్డుకున్న ఎబివిపి నాయకులు

సిరిసిల్ల : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది. 

సిరిసిల్ల : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంబోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు మధ్య వెళుతున్న మంత్రి కాన్వాయ్ ని ఒక్కసారిగా అడ్డుకుని సిరిసిల్ల జిల్లా ఎబివిపి కార్యకర్తలు షాకిచ్చారు. ఎబివిపి జెండాలతో మంత్రి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంంగా నినాదాలు చేసారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ టిఎస్ పిఎస్సి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టినట్లు ఎబివిపి నాయకులు తెలిపారు.