Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండా... ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గుంటుపల్లిలో చిచ్చురేపాయి. 

ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గుంటుపల్లిలో చిచ్చురేపాయి. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తడంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండా కట్టడమే ఈ వివాదానికి,  ఉద్రిక్తతకు కారణమని తెలుస్తోంది. వందలాది మంది వైసీపీ శ్రేణులు కార్యాలయం వద్దకు చేరుకొని రైల్వే రోడ్డుపై బైఠాయించి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి చెదరగొట్టారు. మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా కవిత విజయం సాధించారు. దీంతో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఓ అభిమాని వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండా కట్టాడని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కార్యాలయంపై అద్దెకు ఉంటున్న కార్యకర్తే టీడీపీ జెండా కట్టారని చెబుతున్నారు.