కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది .
ఎస్వీ శిల్ప కళాశాల పరిధిలో శిలలు తయారు చేసే శిల్పులు తమ సమస్యలను టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. శుక్రవారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో శిలా శిల్పులు ఆయన్ను కలసి వినతి పత్రం అందజేశారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్టు చేపట్టే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున , స్వచ్ఛందంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతిలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
చిత్తూరు టీడీపి మాజీ ఎంపి శివప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను అన్నయ్యను కోల్పోయానని ఆయన అన్నారు.
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను అజాత శత్రువుగా పిలుస్తారు.
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాలో గురువారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ఎన్టీఆర్ భవన్ ముద్రించిన పుస్తకాన్ని జనసేన పేరుతో వదిలారంటూ ఆమె వ్యాఖ్యానించారు. పవన్ ప్యాకేజీలు తీసుకుంటూ ఇంకా చంద్రబాబుకు పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు. వంద రోజుల వైసీపీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామని రోజా స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సమీపంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణానికి దగ్గరలో ఉన్న జై గణేశ్ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి.