సౌదీలో చనిపోయిన తన భర్త మృతదేహం కోసం హలీమా నెల రోజులుగా ఎదురు చూస్తోంది. తన భర్తను కడసారి చూసుకొనే అవకాశం కల్పించాలని కూడ ఆమె కోరుతోంది.
బుధవారం సాయి చంద్రమౌళి అంత్యక్రియలకు స్మశాన వాటికకు వెళ్లిన బ్రూనో తరువాతి రోజు ప్రాణాలు విడిచింది. ఈ పరిణామం కుటుంబసభ్యులను కలచివేసింది. బ్రూనో కళేబరాన్నికూడా అదే స్మశాన వాటికలో ఖననం చేశారు.
పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం
యజమాని మృత్యువును తట్టుకోలేక బెంగటిల్లి శునకం తుది శ్వాస విడిచింది. మరణంలోనూ శునకం విశ్వాసాన్ని చూపడం స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో సంభవించింది.
శనివారం ఉదయం ఇద్దరూ కల్లూరులో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో కోళ్ల ఫారం గ్రామం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద వీరి వాహనం అదుపుతప్పి... ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది .
ఎస్వీ శిల్ప కళాశాల పరిధిలో శిలలు తయారు చేసే శిల్పులు తమ సమస్యలను టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. శుక్రవారం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో శిలా శిల్పులు ఆయన్ను కలసి వినతి పత్రం అందజేశారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్టు చేపట్టే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున , స్వచ్ఛందంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతిలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
చిత్తూరు టీడీపి మాజీ ఎంపి శివప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను అన్నయ్యను కోల్పోయానని ఆయన అన్నారు.