కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది . 

కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

10 రూపాయలు ఉన్న లడ్డు ధర 15 రూపాయలు, 50 రూపాయలు ధర 75 రూపాయలు, 100 రూపాయలు ధర 150 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ లడ్డూ ధర త్వరలో అమలు చేస్తామని ఈవో దేముళ్ళు తెలిపారు.

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఆర్థిక సంవత్సరం 2014_ 15 నుండి 2017_18 ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్‌లో లడ్డూ ప్రసాదం తయారీ మరియు అమ్మకమునకు సంబంధించి 5 కోట్ల 80 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నారని తేలింది.

ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా దేవస్థానం అధికారుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

లడ్డు తయారీకి అగు ఖర్చు మరియు రాబడి వివరములు పరిశీలించిన కమిషనర్ ఇతర దేవాలయములులో విక్రయిస్తున్న లడ్డూ ప్రసాదాల రేట్లను పరిశీలించి లడ్డూ ధరను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి