సీరియస్గా పనిచేయకుంటే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.
Telangana Apr 4, 2023, 7:25 PM IST
టెన్త్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై స్పందించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు. పిల్లలను గందరగోళంలోకి నెడితే ఊరుకునేది లేదని సబిత స్పష్టం చేశారు.
Telangana Apr 4, 2023, 2:39 PM IST
టెన్త్ పేపర్ లీక్ అంశంపై బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Telangana Apr 3, 2023, 7:51 PM IST
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసులకు భయపడేది లేదని చెప్పారు.
Telangana Mar 11, 2023, 3:22 PM IST
మహిళా రిజర్వేషన్ పై బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
Telangana Mar 10, 2023, 10:14 AM IST
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేస్తున్న దీక్షకు మద్ధతుగా తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు ఢిల్లీకి బయల్దేరారు.
Telangana Mar 9, 2023, 8:37 PM IST
నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ సహా పలువురు విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానుంది.
Telangana Mar 5, 2023, 6:11 PM IST
సాత్విక్ మృతికి కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని విద్యార్ధి సంఘాల నేతలు ఇవాళ ఆందోళనకు దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు విద్యార్ధులు ధర్నాకు దిగారు.
Telangana Mar 2, 2023, 2:24 PM IST
నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన సాత్విక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చదువుల పేరుతో పిల్లలపై ఒత్తిడి చేయొద్దని సబిత పేర్కొన్నారు.
Telangana Mar 1, 2023, 6:02 PM IST
నార్సింగిలో శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్యపై విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. ఘటన దురదృష్టకరం అన్నారు.
Telangana Mar 1, 2023, 12:37 PM IST
ఓబులాపురం మైనింగ్ కేసులో తన డిశ్చార్జి పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిమీద సీబీఐ వాదనలు వినిపించింది.
Telangana Feb 25, 2023, 9:38 AM IST
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సీబీఐ తనను ఇరికించాలని చూస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టుకు తెలిపారు.
Telangana Feb 18, 2023, 10:04 AM IST
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్టే విధించింది. టీచర్ల బదిలీలపై మార్చి 14 వరకు ధర్మాసనం స్టే విధించింది. నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్ట్ విచారణ జరిపింది.
Telangana Feb 14, 2023, 7:59 PM IST
జీవో నెం 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14 వరకు గడువు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోనికి తీసుకుంటామని ఆమె తెలిపారు.
Telangana Feb 7, 2023, 8:17 PM IST
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు జరిగే షెడ్యూల్ను విడుదల చేసింది.
Telangana Feb 7, 2023, 4:48 PM IST