నా ఫోటోలు పోర్న్ సైట్ లో పెట్టారు, ఎన్టీఆర్ హీరోయిన్ సంచలనం.. ఓపెన్ గా బయట పెట్టిన జాన్వీ కపూర్
శ్రీదేవి, బోనీ కపూర్ కుమార్తె అయినప్పటికీ తనని అవమానించకుండా వదల్లేదు అని జాన్వీ తాజాగా ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.
అతిలోక సుందరి జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఆమెకి రెడ్ కార్పెట్ వేసి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. ఆమె లుక్స్ పై కూడా అనేక విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hxpbcwmwdf8n5dsrswk71ehm/3-jpg_300x374xt.jpg)
కానీ జాన్వీ నెమ్మదిగా తనని తాను మార్చుకుంది. తన తల్లి శ్రీదేవికి ఏమాత్రం తీసిపోని అందంతో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. శ్రీదేవి, బోనీ కపూర్ కుమార్తె అయినప్పటికీ తనని అవమానించకుండా వదల్లేదు అని జాన్వీ తాజాగా ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.
ఒక సంచలన విషయాన్ని కూడా జాన్వీ బయట పెట్టింది. జాన్వీ, రాజ్ కుమార్ రావు నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రం ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతుండడంతో ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఈ విషయాలు షేర్ చేసింది. 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే తన ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టి దుష్ప్రచారం చేశారట.
కొందరు ఆకతాయిలు నా ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టారు. శ్రీదేవి కూతురు అని ఎంతో అసభ్యంగా వైరల్ చేశారు. ఆ ఫోటోలని నా ఫ్రెండ్స్ కూడా చూశారు. నేను స్కూల్ కి వెళితే ఎంతో అవహేళనగా మాట్లాడారు. ఆ వయసులో వాటి గురించి నాకు అవగాహన కూడా లేదు. నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో అర్థం అయ్యేది కాదు.
నన్ను బాడీ షేమింగ్ కి గురిచేశారు. ఆ విమర్శలు ట్రోలింగ్ తట్టుకుని ఇప్పుడు స్ట్రాంగ్ గా మారాను. ఇప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురైనా.. ట్రోలింగ్ జరిగినా నేను భరించగలను. కానీ నా కుటుంబ సభ్యులని ట్రోల్ చేస్తే మాత్రం తట్టుకోలేను. అది నా వీక్ నెస్ అని జాన్వీ కపూర్ తెలిపింది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ రాంచరణ్ కి జోడిగా బుచ్చిబాబు చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. క్రమంగా సౌత్ లో జాన్వీ తన హవా పెంచుకుంటోంది.