టీమిండియా చరిత్రలో హిట్టింగ్ అన్న పదాన్ని చేర్చిన ఆటగాడు వీరేంద్ర సేహ్వగ్. భారత జట్టు తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి మొదటి బంతినుండి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఈ మాజీ హిట్టర్ ని మరో ఆటగాడి బ్యాటింగ్ నచ్చిందంటే అతడెంత దూకుడుగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు. సెహ్వాగ్ చేత ప్రశంసలను అందుకున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా.
CRICKET May 16, 2019, 3:13 PM IST
ఐపిఎల్ సీజన్ 12 ముగిసి నాలుగు రోజులు కావస్తోంది. అయినా ఈ లీగ్ గురించి అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరుపై మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరీముఖ్యంగా కీలక సమయంలో ధోని రనౌట్ పై క్లారిటీ లేకున్నా అంపైర్లు తమ నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించడంపై చెన్నై అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఇదే చెన్నై గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్నది వారి వాదన. అలాంటి సమయంలో న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషన్ ఈ రనౌట్ వివాదంలో తలదూర్చి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
CRICKET May 16, 2019, 2:34 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పై బౌలర్ కుల్దీప్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్త గత రెండు రోజులుగా ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని కుల్దీప్ తాజాగా ఖండించాడు. తాను ధోనికి వ్యతిరేకంగా మాట్లాడలేనని...మీడియా, సోషల్ మీడియాలో నా మాటలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నట్లు కుల్దీప్ తెలిపాడు.
CRICKET May 15, 2019, 9:19 PM IST
మరికొద్దిరోజుల్లో వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు కొనసాగిన ఐపిఎల్ ఫీవర్ ఇప్పుడు వరల్డ్ కప్ వైపు మళ్లింది. అయితే ఈ ఐపిఎల్ సీజన్ 12 రెండు నెలల పాటు భారత క్రికెట్ అభిమానులకు మజాను పంచినా ఇప్పుడు మాత్రం ఆందోళనను కలిగిస్తోంది. ప్రపంచ కప్ ఎంపికైన భారత ఆటగాడు కేదార్ జాదవ్ గాయం, కుల్దీప్ యాదవ్ ఫామ్ లేమి ఈ ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తోడు తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ కామెంట్ మరింత గందరగోళానికి కారణమయ్యింది.
CRICKET May 15, 2019, 6:43 PM IST
ఇంగ్లాండ్ వేదికగా మరికొద్దిరోజుల్లో ఐసిసి వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నీకోసం ఎంపికచేసిన భారత జట్టును కొద్దిరోజుల క్రితమే బిసిసిఐ ప్రకటించారు. అయితే ఆ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్, అంబటి రాయుడికి సెలెక్టర్లు చోటు కల్పించకపోవడం వివాదానికి దారితీసింది. అప్పటితో ఆ వివాదం సద్దుమణిగినా ఐపిఎల్లో పంత్ అద్భుతంగా రాణించడంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. గంగూలీ, పాంటింగ్ వంటి మాజీలు డిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న పంత్ ని భారత్ ప్రపంచకప్ కోసం ఎంపికచేయకపోవడాన్ని తప్పుబట్టారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
CRICKET May 15, 2019, 5:28 PM IST
ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఎంపికచేసే విషయంలో సెలెక్షన్ కమిటీ పొరపాట్లు చేసిందని మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించారు. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ప్రపంచ కప్ 2019 లో టీమిండియాపై ప్రభావం చూపనున్నాయన్నాడు. యువ కిలాడి రిషబ్ పంత్ కు ప్రపంచ కప్ ఆడే అవకాశమివ్వక పోవడం అతిపెద్ద పొరపాటుగా గంగూలీ అభివర్ణించాడు.
CRICKET May 15, 2019, 3:52 PM IST
ఐపిఎల్ 12 సీజన్ మొత్తంలో జరిగిన అన్ని మ్యాచులు ఒకెత్తయితే...ఫైనల్ మ్యాచ్ ఒక్కటి మరోఎత్తు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్న ఇంకా దానిపై చర్చ కొనసాగుతూనే వుంది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ పోరులో అనూహ్యమైన మలుపులు, అనుమానాస్పద సంఘటనలు, అంపైర్ల తప్పిదాలపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికంటే మ్యాచ్ గతిని మలుపు తిప్పిన మలింగ ఫైనల్ ఓవర్ పై అభిమానుల మధ్యే కాదు మాజీలు,క్రికెట్ విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.
CRICKET May 15, 2019, 3:11 PM IST
ప్రపంచ కప్ కు ముందు పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. స్వదేశంలోని బ్రిస్టన్ వేదికగా మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టుకు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (151 పరుగులు) సెంచరీతో చెలరేగి మంచి ఆరంభాన్నివ్వడంతో 358 పరుగులు భారీ స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.5 ఓవర్లలోనే చేధించింది. ఈ చేధనలో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో సెంచరీతో చెలరేగి ఇంగ్లాండ్ ను విజయతీరాలు చేర్చాడు.
CRICKET May 15, 2019, 2:27 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 ముగిసి రెండు రోజులవుతున్నా క్రికెట్ ప్రియులింకా అదే లోకంలో వున్నారు. లీగ్ జరుగుతున్నంత కాలం తమ అభిమాన జట్లకు సంబంధించిన మ్యాచులు, ఆటగాళ్ల ఆటతీరు గురించి చర్చించుకున్న వారు ఫైనల్ తర్వాత ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. సహజంగానే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ సింగిల్స్, డబుల్స్ రాబట్టడంలో దిట్ట అయిన ధోని రనౌటవడం అందరిలోనూ అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా చెన్నై అభిమానులయితే అంపైర్ల తీరుపై సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తున్నారు.
CRICKET May 14, 2019, 10:54 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ ని విజేతగా నిలపడంతో బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా పాత్ర మరిచిపోలేనిది. సీజన్ 12 ఆరంభం నుండి ఎప్పుడు జట్టు కష్టాల్లో వున్నా తన బౌలింగ్ తో మాయ చేశాడు. ఇక ఫైనల్లో అతడు 19 వ ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసి బ్రావో వికెట్ పడగొట్టిన తీరు అద్భుతం. అదే మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఇలా బిగ్ మ్యాచ్ లో జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇవన్ని అతడికి ఎంత సంతోసాన్నిచ్చాయో తెలీదు కానీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంస మాత్రం బుమ్రాకు మనసుని తాకినట్లుంది.
CRICKET May 14, 2019, 8:58 PM IST
ముంబై ఇండియన్స్ ఐపిఎల్ సీజన్ 12 విజేతగా అవతరించింది. ఈ సీజన్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడిస్తూ వస్తున్న ఈ జట్టు ఫైనల్లోనే అదే ఆటతీరును కనబర్చింది. హైదరాబాద్ వేదికగా ధోని సేనతో సాగిన ఉత్కంఠభరితంగా పోరులో రోహిత్ సారథ్యంలోని ముంబై ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఇలా చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి లసిత్ మలింగ హీరోగా మారిపోయాడు. కానీ అతడు చివరి ఓవర్లో చివరి బంతికి వికెట్ పడగొట్టడంతో తన సలహా ఎంతగానో ఉపయోగపడిందని తాజాగా రోహిత్ వెల్లడించాడు.
CRICKET May 14, 2019, 6:34 PM IST
హైదరాబాద్ లో జరిగిన ఫైనల్లో చెన్నైపై గెలిచిన ముంబై ఇండియన్స్ 2019 ట్రోఫీతో సొంత నగరానికి చేరుకుంది. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.
CRICKET May 14, 2019, 5:47 PM IST
రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ జట్టును మరోసారి ఐపిఎల్ విజేతగా నిలిపిన సక్సెస్ ఫుల్ కెప్టెన్. విరాట్ కోహ్లీ వంటి సీనియర్ కెప్టెన్ ఒక్క ఐపిఎల్ ట్రోఫీని కూడా సాధించలేక సతమతపడుతుంటే రోహిత్ మాత్రం ఏకంగా తన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోఫీని వేసుకున్నాడు. ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కే కాదు టీమిండియా కు తన సారథ్యంలో ఎన్నో విజయాలను అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ధోని పేరుతెచ్చుకున్నాడు. అలాంటి సీనియర్ సారథిని వెనక్కినెట్టి రోహిత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సారథుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
CRICKET May 14, 2019, 5:04 PM IST
హాట్ హాట్ సమ్మర్ లో క్రికెట్ ప్రియులకు ఐపిఎల్ 2019 మంచి మజాను పంచింది. రెండు నెలల పాటు సాగిన ఈ మెగా లీగ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలించింది. ఈ విజయంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోపి వచ్చి చేరింది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగతంగా రికార్డులు సాధించకున్నా సమిష్టిగా రాణించి విజయకేతనం ఎగురవేశారు. ఇదే సమిష్టితత్వం తమ జట్టును టైటిల్ విజేతగా నిలలబెట్టిందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే అభిప్రాయపడ్డారు.
CRICKET May 14, 2019, 3:22 PM IST
ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్చుంటే చాలు.. అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది.
SPORTS May 14, 2019, 3:05 PM IST