శనివారం జరిగే డిజిపిల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్ కు చేరుకున్నారు.
చండీగఢ్ నుండి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనమండలి చేర్మెన్ స్వామి గౌడ్ ,అసెంబ్లీ స్పీకర్ మధుసుదన చారి, రాష్ట్ర మంత్రులు నాయని నర్సింహ రెడ్డి,కెటిఆర్,మహేందర్ రెడ్డి, జోగు రామన్న,ఇంధ్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు, లక్ష్మరెడ్డి,పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి పాల్గొన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,అరికపుడి గాంధీ, తీగళ కృష్ణరెడ్డి,మాగంటి గోపీనాథ్, చింతల రామచంద్ర రెడ్డి, రాజసింగ్,కిషన్ రెడ్డి,ఎన్విఎస్ ప్రభాకర్ ,ఎంపిలు మల్లారెడ్డి, కోండా విశ్వేరరెడ్డి, రెండు రాష్ట్రల డిజిపిలు,గవర్నర్,రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మన్,బిజెపి నాయకులు స్వాగతం పలికారు. శనివారం జరిగే డిజిపిల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
