11:54 PM (IST) Apr 22

LSG vs DC: 27 కోట్ల దెబ్బ‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ల‌క్నో అందుకే ఓడిపోయింది !

IPL 2025 LSG vs DC: ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. ల‌క్నో ఓపెన‌ర్లు ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ తప్ప మిగ‌తా ప్లేయ‌ర్లు రాణించ‌లేదు. రూ.27 కోట్ల రిష‌బ్ పంత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. కేఎల్ రాహుల్, అభిషేక్ పొరేల్, అక్ష‌ర్ ప‌టేల్ సూప‌ర్ నాక్ ల‌తో ల‌క్నో హోం గ్రౌండ్ లో ఢిల్లీ విక్ట‌రీ కొట్టింది.

పూర్తి కథనం చదవండి
11:53 PM (IST) Apr 22

Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దాడి తమను కలిచివేసిందని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రమూకల దాడి గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శ్రీనగర్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. దీంతో షా ఇప్పటికే శ్రీనగర్‌ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. 

పూర్తి కథనం చదవండి
11:35 PM (IST) Apr 22

Pahalgam Terror Attack:

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. అమర్నాథ్‌యాత్రకు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు. ఇప్పటికైతే మృతుల సంఖ్య లెక్కకు రాలేదు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఆ దృశ్యాలు చూసిన వారు అయ్యో ఎంత ఘోరం జరిగిందోనని బాధపడుతున్నారు. 

పూర్తి కథనం చదవండి
11:16 PM (IST) Apr 22

Pahalgam terror attack : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ సంతాపం

భారత పర్యటనలో ఉన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ పహల్గాం ఉగ్రదాడిపై స్పదించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నేతల ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్ట్ లకు సంతాపం తెలిపారు.

పూర్తి కథనం చదవండి
11:06 PM (IST) Apr 22

ఈ 5 ప‌నుల‌తో జ్ఞాపకశక్తి పెరిగి మీ బ్రెయిన్ సూప‌ర్ కంప్యూట‌ర్ లా స్పీడ్ గా ప‌నిచేస్తుంది

5 Brain exercises to improve your memory: మెదడు వ్యాయామాలు బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.. జ్ఞాపకశక్తిని మ‌రింత‌గా పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి మీ మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రిచే విష‌యాలు చాలానే ఉన్నాయి. మీ జ్ఞాపకశక్తిని పదును పెట్టే కొన్ని ప‌నులు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:55 PM (IST) Apr 22

Laptop Companies బైబై చైనా.. ల్యాప్‌టాప్‌ కంపెనీలు ఇండియాకి క్యూ!

భారత్ బాట: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు. కానీ కొన్నాళ్లుగా ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్‌ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. దానికి కారణమేంటో మీరు తెలుసుకోవాల్సిందే.

పూర్తి కథనం చదవండి
10:54 PM (IST) Apr 22

పహల్గాం మారణహోమం ఈ ఉగ్రవాద సంస్థ పనే... ఏమిటీ టీఆర్ఎఫ్?

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకుడు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఈ సంస్థ చరిత్ర ఏమిటి, దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటి? తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:28 PM (IST) Apr 22

jeera water: ఉదయం జీరా వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల కలిగే 5 ప్రయోజనాలు

jeera water: జీలకర్రను మనం రోజువారీ వంటలలో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం కానీ, దీంతో అనేక లాభాలు ఉన్నాయి. ప్ర‌త్యేక రుచిని క‌లిగిన జీరాతో జీర్ణక్రియ మెరుగుప‌డ‌టం, బరువు తగ్గడం, జీవక్రియ కీల‌కంగా ప‌నిచేయ‌డం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. చర్మం, జుట్టుకు కూడా ఎంతో మేలుచేస్తుంది. ఉదయం జీలకర్ర నీరు (జీరా వాట‌ర్) తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:27 PM (IST) Apr 22

నటికి క్షమాపణ చెప్పిన షైన్ టామ్ చాకో, రాజీకి ప్రయత్నం

ఇంటర్నల్ కమిటీ మీటింగ్‌లో షైన్ విన్సీకి క్షమాపణ చెప్పాడు. ఇకపై ఇలాంటివి జరగవని హామీ ఇచ్చాడు.

పూర్తి కథనం చదవండి
10:19 PM (IST) Apr 22

కేసరి 2 ఓటీటీ హక్కులు: అక్షయ్ కుమార్ సినిమా ఇక్కడ చూడండి

జలియన్ వాలాబాగ్ దురంతం నేపథ్యంలో మలయాళీ న్యాయవాది వీరగాథను అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి' చిత్రం చూపిస్తుంది. దీని OTT విడుదల, బాక్సాఫీస్ విజయం, చరిత్రలో పాతుకుపోయిన శక్తివంతమైన కథనం గురించి ఇక్కడ తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
10:10 PM (IST) Apr 22

తెలుగు, తమిళ సినిమాలని రీమేక్ చేసిన బాలీవుడ్ హీరో.. ఎన్ని ఫ్లాపులు పడ్డాయో తెలుసా ?

అజయ్ దేవగన్ తన రాబోయే చిత్రం రెయిడ్ 2 తో వార్తల్లో నిలిచారు. ఆయన సినిమా మే 1న విడుదల కానుంది. దీనికి ముందు, అజయ్ దక్షిణాది సినిమాల రీమేక్‌లుగా ఉన్న కొన్ని చిత్రాల గురించి మీకు చెప్పబోతున్నాం.

పూర్తి కథనం చదవండి
10:06 PM (IST) Apr 22

Pahalgam terror attack :టూరిస్టులు, బాధితుల సమాచారం కోసం... ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం దిగ్బ్రాంతికి గురయ్యింది. ఈ క్రమంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లినవారి కుటుంబాలు, స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టూరిస్టులు, బాధితుల సమాాచారం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి. 

పూర్తి కథనం చదవండి
09:36 PM (IST) Apr 22

Pahalgam Terror Attack : ప్రధాని మోదీ సీరియస్ ... అమిత్ షా కు కీలక ఆదేశాలు

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రధాని వెంటనే స్పందించి సీరియస్ కామెంట్స్ చేసారు. 

పూర్తి కథనం చదవండి
08:54 PM (IST) Apr 22

కాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు... కేవలం హిందూ పర్యాటకులే టార్గెట్, 24 మంది మృతి

దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో కనీసం 24 మంది హిందూ పర్యాటకులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. బాధితుల మత గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. 

పూర్తి కథనం చదవండి
08:42 PM (IST) Apr 22

Vehicle Horns : రోడ్లపై పాం.. పాం శబ్దాలుండవు... ట్రాఫిక్ లో చిక్కుకున్నా చిరాకు ఉండదిక

రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతుంటేనే వాహనాల హారన్ శబ్దాలు చెవులు చిల్లుపడేలా వినిపిస్తాయి. ఇక హైవేలపై వాహనం నడుపుకుంటూ వెళుతున్నా... ట్రాఫిక్ లో చిక్కుకున్నా ఆ హారన్ల మోతకు చిర్రెత్తుకువస్తుంది. అయితే ఇకపై ఇలాంటి అనుభవం కాకుండా హాయిగా హారన్ శబ్దాలను కూడా ఆస్వాదించేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

పూర్తి కథనం చదవండి
08:09 PM (IST) Apr 22

ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరు?

Most Player of the Match awards in IPL: ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో మరో రికార్డు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' (POTM) అవార్డులను అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:22 PM (IST) Apr 22

UPSC 2024 Results: మీ బిడ్డలను IAS, IPS చేయాలని కలగంటున్నారా? ఆలిండియా టాపర్ శక్తి దూబే సక్సెస్ స్టోరీ మీకోమే

మీ పిల్లలను IAS గానో లేక IPS గానో చూడాలని కలగంటున్నారా? అందుకోసం ఎలా సన్నద్దం చేయాలో తెలియడం లేదా? అయితే యూపిఎస్సి 2024 ఫలితాల్లో ఆలిండియా టాపర్ గా నిలిచిన ఆడబిడ్డ శక్తి దూబే సక్సెస్ స్టోరీని తెలుసుకోండి. ఆమెను ఆదర్శంగా తీసుకుని సివిల్స్ కు ప్రిపేర్ అయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 

పూర్తి కథనం చదవండి
07:15 PM (IST) Apr 22

ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్! ఓటమి తర్వాత ఆ జట్టు కష్టాల్లో పడింది !

IPL 2025 Match Fixing: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. సగానికి చేరిన ఈ మెగా క్రికెట్ లీగ్ మధ్యలో ఒక జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎందుకంటే దాదాపు గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:04 PM (IST) Apr 22

UPSC 2025 Results:

UPSC 2025 Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్‌ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్‌ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్‌ సర్వెంట్‌ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్‌ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను. 

పూర్తి కథనం చదవండి
06:58 PM (IST) Apr 22

Railway Rules: రైల్లో మద్యం తాగితే జైలులో ఎన్నాళ్లు ఉండాలో తెలుసా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

Railway Rules: ఇప్పుడు పెగ్గు పడందే ఏ పనీ చేయలేనంతగా కొంత మంది జనం తయారవుతున్నారు. మరి రైళ్లలో మద్యం తాగి ప్రయాణిస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? ఈ విషయంపై రైల్వే నిబంధనలు, శిక్షలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి