UPSC 2025 Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్‌ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్‌ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్‌ సర్వెంట్‌ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్‌ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను.   

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్‌ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్‌ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్‌ సర్వెంట్‌ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్‌ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను. 

తెలుగు తేజాలు హవా. 
సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలగు రాష్ట్రాలకు చెందిన ఈ.సాయి శివాని 11వ ర్యాంకు, బి.వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్‌ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకులతో టాప్​ 100లో చోటు దక్కించుకున్నారు. ఇక ఎన్‌ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డి 119, చల్లా పవన్‌ కల్యాణ్‌ 146, ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190, పోతురాజు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకులతో మొదటి మూడు వందల ర్యాంకుల్లో 13 మంది ప్రతిభ చూపారు. 


మొత్తం 1,009 మందికి కొలువులు.. 
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మొత్తం 1000కి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ రాగా.. ఆ ఏడాది జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. దేశ వ్యాప్తంగా 9,92,599 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,83,213మంది పరీక్ష రాశారు. ఇందులో సెప్టెంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షకు 14,627మంది క్వాలిఫై  అయ్యారు. ముఖాముఖికి 2,845మంది సెలెక్టయ్యారు. తుది ఫలితాల్లో 1,009 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందులో 725 మంది అబ్బాయిలు, 284 మంది మహిళలు ఉన్నారు. కేటగిరీల వారీగా జనరల్‌ 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ 87మంది ఎంపికయ్యారు. సివిల్స్లో సత్తా చాటిన టాప్ 25 ర్యాంకర్లలోని అభ్యర్థులు అంతా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, వీఐటీ, జేఎన్జూ, దిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వ విద్యాలయాల, విట్ యూనివర్సిటీ వంటి విశ్యవిద్యాలయాలకు చెందిన వారే.